Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏం చేద్ధాం... దుకాణం బంద్ చేద్దామా? మీరే ఓ మాట చెప్పండి...

Webdunia
బుధవారం, 12 మే 2021 (19:30 IST)
రాష్ట్ర అసెంబ్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విశ్వనటుడు కమల్ హాసన్ సారథ్యంలోని మక్కల్ నీది మయ్యం పార్టీ చిత్తుగా ఓడిపోయింది. కమల్ పోటీ చేసిన కోయంబత్తూరు దక్షిణం స్థానంలో కూడా ఓడిపోయారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే పార్టీలో ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ ఆ పార్టీ  ఉపాధ్యక్షుడు ఆర్.మహేంద్రన్ రాజీనామా చేశారు. తనతో పాటు మరో ఆరుగురినీ ఆయన తీసుకెళ్లారు. అదేసమయంలో పార్టీ అధినేత కమల్ హాసన్‌పై కూడా విమర్శలు గుప్పించారు. 
 
ఈ క్రమంలో కమల్ దిద్దుబాటు చర్యలకు దిగారు. మనసులో మాట చెప్పాలంటూ పార్టీ కార్యకర్తలను కోరారు. ఏమనుకుంటున్నారో తనకు మెయిల్ ద్వారా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే, వివాదాలు వచ్చాయని, పరిస్థితులు మారాయని పార్టీ సిద్ధాంతాలను, లక్ష్యాలను మార్చలేమన్నారు. 
 
తొలిసారి అసెంబ్లీ ఎన్నికలనే పెద్ద యుద్ధంలో బరిలోకి దిగి సమర్థంగా పోరాడామని ఈ సందర్భంగా కమల్ హాసన్ గుర్తుచేశారు. అయితే, ఆ పోరులో వెన్నుపోటుదారులు, శత్రువులు ఎంతో మందిని ఎదుర్కొన్నామన్నారు. ఆ జాబితాలో మహేంద్రన్ ముందుంటారని చెప్పుకొచ్చారు. 
 
అతడి అసమర్థతను వేరే వారిపై రుద్దేందుకు చూస్తున్నారన్నారు. ఓటమితో దిగులు చెందొద్దని కార్యకర్తలకు సూచించారు. పార్టీలో ఉన్న వెన్నుపోటుదారులను గుర్తించి బయటకు పంపించి.. పార్టీకి పునరుత్తేజం కల్పిస్తామని ఆయన తెలిపారు. కాగా, 234 స్థానాలకుగానూ 154 స్థానాల్లో కమలహాసన్ పార్టీ బరిలో నిలిచింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dil Raju: సినిమాల్లో రాణించాలంటే ఈజీ కాదు; ఔత్సాహికులు ఆలోచించుకోవాలి : దిల్ రాజు

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసిన జిగ్రీస్ క్రేజీ లుక్

వారిపై పరువునష్టం దావా వేశాం: జీ5 తెలుగు హెడ్ అనురాధ

Nani: నేచురల్ స్టార్ నాని చిత్రం ది పారడైజ్ సెట్లోకి ఎంట్రీ

Mohan babu: భగవంతుడి ఆజ్ఞతోనే కన్నప్ప విజయం దక్కింది : డా. ఎం. మోహన్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments