Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ మనవరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష... ఎక్కడ.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (10:36 IST)
భారత జాతిపిత మహాత్మా గాంధీ మనవరాలికి ఏడేళ్ళ జైలుశిక్ష పడింది. ఓ ఫోర్జరీ కేసులో ఆమెకు సౌతాఫ్రికా కోర్టు ఏడేళ్ళ పాటు జైలుశిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది. 53 యేళ్ళ అశీష్ లతా రాంగోబిన్.. గాంధీ మునిమనవరాలు. సౌతాఫ్రికాలో ఉంటున్నారు. 
 
ఈమె ఓ ఫోర్జరీ కేసులో రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఆమె దోషిగా తేలింది. ఫలితంగా డర్బన్ కోర్టు ఆమెకు ఏడేళ్ల జైలుశిక్ష విధిస్తూ సోమవారం కోర్టు తీర్పునిచ్చింది. 
 
ప్రముఖ వ్యాపారవేత్త నుంచి ఎస్ఆర్ మహరాజ్‌ను మోసం చేసినట్లు తెలిపింది. ఆమె కోసం భారత్ నుంచి వచ్చే ఓ కన్‌సైన్‌మెంట్ కోసం, ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్... ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) ఇచ్చాడు. 
 
ఆ కన్‌సైన్‌మెంట్ ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. అయితే, అసలా కన్‌సైన్‌మెంటే లేదనీ.... అలా అడ్డగోలు నకిలీ బిల్లులు సృష్టించి... ఆమె ఆయన్ని మోసం చేశారని తేలింది.
 
ప్రముఖ హక్కుల పోరాట యోధురాలు ఎలా గాంధీ, దివంగత మేవా రామ్‌గోబింద్‌ల కూతురే ఆశిష్ లతా రాంగోబిన్. ఈ కేసు విచారణ 2015లోనే ప్రారంభమైంది. ఆమె మోసపూరిత చర్యలో భాగంగా... లేని కన్‌సైన్‌మెంట్ ఉన్నట్లుగా చూపించేందుకు నకిలీ ఇన్వాయిస్‌లు, డాక్యుమెంట్లు సృష్టించారని తెలిసింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments