Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్య ప్రియుడితో లేచిపోయింది.. అంతే కుమార్తెలతో కలిసి అధ్యాపకుడు ఏం చేశాడంటే?

Webdunia
బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:18 IST)
భార్య అంటే ఆ అధ్యాపకుడికి పంచప్రాణాలు. ఆమెపై అంతులేని ప్రేమను కలిగివున్నాడు. కానీ ఆమెకు మాత్రం ప్రియుడంటే మోజు. అందుకే ప్రియుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. అతని కోసం ఇంటి నుంచి పారిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అధ్యాపకుడు.. పిల్లలను ముందుగా ఉరేసి చంపేశాడు. ఆపై అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర సరిహద్దు పట్టణమైన బల్లార్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రుషికాంత్ (40) ప్రైవేటు ఐటీఐలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు నారాయణి (5), కార్తిని (2)తో ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. వారం రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో రుషికాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలను చూసిన భార్య వెంటనే పోలీసులకు, తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయినా రుషికాంత్, నారాయణి, కార్తిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

Raghu kunche: గేదెలరాజు కాకినాడ తాలూకా చిత్రంలో రఘుకుంచే లుక్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

How to Use Hair Oil: మహిళలు జుట్టుకు నూనె ఎలా రాసుకోవాలో తెలుసా?

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తర్వాతి కథనం
Show comments