Webdunia - Bharat's app for daily news and videos

Install App

రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌: 30మందికి అస్వస్థత

Webdunia
మంగళవారం, 12 అక్టోబరు 2021 (18:51 IST)
Gas
మహారాష్ట్రలోని ఓ రసాయన కర్మాగారంలో గ్యాస్‌ లీక్‌ కావడంతో 30 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. కర్మాగారం సమీపంలో నివసిస్తున్న స్థానికులు ఊపిరాడకపోవడం, కళల్లో మంట, వికారం, ఇతర ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారని థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రాంతీయ విపత్తు నిర్వహణ సెల్‌ చీఫ్‌ సంతోష్‌ కదం తెలిపారు. అంబర్‌నాథ్‌లోని మహారాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (MIDC)లో ఉన్న ఓ ప్లాంట్‌ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ లీక్ అయినట్లు ఆయన చెప్పారు.
 
ఆ తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఇతర సమస్యలతో 34 మంది ఉల్లాస్‌నగర్‌లోని సెంట్రల్‌ ఆసుపత్రిలో చేరారినట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం వారంతా చికిత్స పొందుతున్నారని, ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని తెలిపారు. ఘటన అనంతరం అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని, గ్యాస్‌ లీక్‌ కాకుండా చర్యలు చేపట్టారు. లీకేజీకి గల కారణాలు తెలుసుకునేందుకు విచారణ జరుపుతున్నట్లు సంతోష్‌ కదం వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments