Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్త మృతి - కోడలి సంతోషం ... భార్యను మిద్దెపై నుంచి తోసి చంపిన భర్త

Webdunia
గురువారం, 14 మార్చి 2019 (09:36 IST)
అప్పటివరకు తనను రాసిరంపాన పెట్టిన అత్త చనిపోయింది. అంతే.. ఆ ఇంటి కోడలికి ఎక్కడలేని సంతోషం చెందింది. దీన్ని చూసిన ఆమె భర్త.. ఆగ్రహంతో ఊగిపోయాడు. తన తల్లి చనిపోతే సంతోషపడతావా అంటూ మిద్దెపై నుంచి భార్యను కిందికి తోసి చంపేశాడు. ఈ ఘటన వెస్ట్ మహారాష్ట్రలోని జునా రాజ్‌వాడ ఏరియాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జునా రాజ్‌వాడా అనే ప్రాంతానికి చెందిన మాలతి అనే వృద్ధురాలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈనెల 9వ తేదీన చనిపోయింది.
 
దీంతో ఆమె కోడలు శుభంగి లోఖండే (35) పట్టరాని సంతోషంలో మునిగిపోయింది. తనలోని ఆనందాన్ని దాచులోకే శవం పక్కనే నిలబడి ఫక్కున నవ్వేసింది. దీన్ని శుభంగి భర్త సందీప్ లోఖండే కళ్లారా చూశాడు. 
 
తల్లి చనిపోయి తాను విషాదంలో ఉంటే నువ్వు ఆనదంపడతావా అంటూ భార్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాము నివశిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి కిందికి తోసేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శుభంగి ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచింది. 
 
దీనిపై తొలుత స్థానిక మీడియా.. అత్త మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కోడలు అంటూ వార్తా కథనాలను ప్రచురించాయి. కానీ, పోలీసులు మాత్రం సందేహించి.. విచారణ చేపట్టారు. ఈ విచారణలో అసలు విషయం వెల్లడైంది. దీంతో సందీప్ లోఖండేను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments