Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రేకప్.. వెంటపడ్డాడు.. అత్యాచారం చేశాడు.. చేయించాడు.. చివరికి కిరోసిన్ పోసి?

Advertiesment
Man
, బుధవారం, 13 మార్చి 2019 (17:15 IST)
కొంతకాలం చట్టాపట్టాలేసుకుని తిరిగిన ప్రేమికుల మధ్య లవ్ బ్రేక్ అప్ అయింది. కానీ ఆమెను మరిచిపోలేని ప్రియుడు ఆమె వెంటపడ్డాడు. పెళ్లి చేసుకోమని కత్తితో బెదిరించాడు. ఒప్పుకోకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. తన స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. ఆ తర్వాత కిరోసిన్ పోసి కాల్చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. 
 
ఢిల్లీలోని ఆర్‌కే పురం ఏరియాకు చెందిన 18 ఏళ్ల అజిత్ రేగి మ్యాథ్యూ కుంబానంద్ ఏరియాకు చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. అయిరోర్ ఏరియాలో ఉన్న ఓ ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ చదువుతున్న ఆ అమ్మాయి కూడా మ్యాథ్యూని ప్రేమించింది. ఇద్దరూ కలిసి కొన్నాళ్లు పార్క్‌లకు, సినిమాలకు తిరిగారు. మద్యానికి బానిసైన మ్యాథ్యూని చూసి ఆమె అసహ్యించుకుంది. 
 
కలుసుకోకుండా దూరంపెట్టింది. కొన్నాళ్ల క్రితం లవ్‌కి కూడా గుడ్‌బై చెప్పింది. కానీ ఆమెని మరిచిపోలేని ప్రియుడు వెంటపడి వేధించాడు. కానీ ఆ అమ్మాయి పట్టించుకోలేదు. సోమవారం మ్యాథ్యూ, అతని స్నేహితుడు అఫ్తబ్ ఖాన్ కలిసి అమ్మాయి చదువుకుంటున్న కళాశాలకు వెళ్లారు. ప్రియురాలు కనిపించగానే దగ్గరకు వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగాడు, ససేమిరా కాదనడంతో మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. 
 
కానీ లొంగకపోవడంతో అత్యాచారానికి ఒడిగట్టాడు. తాను మాత్రమే కాకుండా స్నేహితుడితో కూడా అత్యాచారం చేయించాడు. ఇద్దరూ కలిసి ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. మంటలలో చిక్కుకున్న ఆమె అరుపులు విని స్థానికులు అక్కడికి చేరుకున్నారు.
 
మంటలు ఆర్పి 60 శాతం కాలిన గాయాలతో ఉన్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అఘాయిత్యానికి పాల్పడిన మ్యాథ్యూని, అతని స్నేహితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బోయింగ్ విమానం ఇలా కూలింది... బాబోయ్ అంటున్న ప్రపంచ దేశాలు(ఫోటోలు)