Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజల తీర్పును శిరసావహిస్తాం... ప్రతిపక్షంలో కూర్చొంటాం : శరద్ పవార్

Webdunia
బుధవారం, 6 నవంబరు 2019 (15:01 IST)
మహాష్ట్ర ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించి, ప్రతిపక్షంలో కూర్చొంటామని ఎన్సీపీ చీప్ శరద్ పవార్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్రలో బీజేపీ - శివసేన ప్రభుత్వం ఈ నెల 8వ తేదీలోపు ఏర్పాటుకానుంది. 
 
మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్పందించారు. బుధవారం మధ్యాహ్నం శరద్‌ పవార్‌ మీడియాతో మాట్లాడుతూ.. శివసేన - బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. వీలైనంత త్వరగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు చెప్పారు. 
 
ఎన్సీపీలు విపక్షంలోనే కూర్చుంటాయని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. శివసేనతో ఎన్సీపీ చేతులు కలపదని ఆయన తేల్చిచెప్పారు. శివసేన - ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్న ప్రశ్నే లేదన్నారు. 
 
గత 25 ఏళ్ల నుంచి బీజేపీ - శివసేన కలిసి ఉన్నాయి. ఇవాళ, రేపో ఆ రెండు పార్టీలే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని పేర్కొన్నారు. ఒక వేళ బీజేపీ - శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే రాష్ట్రపతి పాలన తప్పదని హెచ్చరించారు. శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ ఇవాళ ఉదయం తనను కలిశారు అని శరద్‌ పవార్‌ చెప్పారు. అయితే ఈ సందర్భంగా త్వరలో జరిగే రాజ్యసభ సెషన్స్‌పై తనతో సంజయ్‌ చర్చించారని పేర్కొన్నారు. రాజ్యసభలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించామని శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.21 కోట్లు వడ్డీతో చెల్లించండి.. విశాల్‌కు హైకోర్టు ఆదేశం

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments