Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో రైతు ఇంట్లో 400 కేజీల టమోటాలు చోరీ

Webdunia
శుక్రవారం, 21 జులై 2023 (19:35 IST)
మహారాష్ట్రలోని పూణె‌లో ఓ రైతు ఇంట ఉంచిన టమోటాలు చోరీకి గురయ్యాయి. ఇంటిలో విక్రయానికి వచ్చిన టమోటాల్లో 400 కేజీలు చోరీకి గురయ్యారు. దీంతో స్థానిక పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మహారాష్ట్ర పూణెకు చెందిన ఓ రైతు తన పొలం నుంచి కోసుకొచ్చిన 400 కేజీల టమోటాలను రాత్రి ఇంటి బయట వాహనంలో ఉంచాడు. తెల్లారి చూసే సరికి ఆ సరకు మాయమైంది. దీంతో అతడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు.
 
శిరూర్‌ తహసిల్‌ పరిధిలోని పింపార్‌ఖేడ్‌కు చెందిన రైతు అరుణ్‌ ధోమే టమాటా సాగు చేశాడు. మార్కెట్లో మంచి ధర పలుకుతుండటంతో 400 కేజీల దాకా కోసి ఇంటికి తీసుకొచ్చాడు. మరుసటి రోజు మార్కెట్‌కు తరలిద్దామనే ఉద్దేశంతో వాటిని 20 పెట్టెల్లో సర్ది ఇంటి బయటే వాహనంలో ఉంచాడు. తెల్లవారుజామునే ఆ వాహనం దగ్గరకు వెళ్లి చూడగా అరుణ్‌కు టమాటా పెట్టెలు కన్పించలేదు. 
 
చుట్టుపక్కల గాలించినా లాభం లేకపోయింది. తన పంటను ఎవరో దొంగిలించారని నిర్ధారించుకున్న రైతు వెంటనే శిరూర్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. రైతు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. టమాటాల దొంగతనంపై విచారణ చేస్తున్నామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments