Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం.. సునామీ తలపించేలా మృతులు

Webdunia
శనివారం, 1 మే 2021 (14:25 IST)
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. ఏకంగా సునామీని తలపించేలా చేస్తోంది. గత ఏప్రిల్ 1నుంచి 30 వరకూ 17లక్షలకుపైగా ప్రజలు కరోనా బారినపడ్డారు. ఈక్రమంలో ప్రతీ రోజు 50 వేలమందికి పాజిటివ్ నిర్ధారణ అవుతోంది. దీంతో దేశంలోనే మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్‌లో పెరుగుతుందో ఊహించుకుంటేనే ప్రాణాలు హడలిపోతున్నాయి. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే 17.46 లక్షల మంది కరోనా బారినపడ్డారు.
 
ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 17,46,309 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఏప్రిల్‌ 1న 28,56,163గా ఉన్న పాజిటివ్‌ కేసుల సంఖ్య నెలాఖరు నాటికి 46,02,472 చేరింది. కాగా, గతేడాది సెప్టెంబర్‌ 16న మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 10,97,856గా ఉంది.  
 
రాష్ట్రంలో కరోనా రెండోసారి విజృంభించడంతో కేవలం 30 రోజుల్లోనే 17.46 లక్షల కేసులు రికార్డయ్యాయి. అదేవిధంగా గత 167 రోజుల్లో కరోనాతో 14,039 మంది మృతిచెందారు. కేసులు భారీగా నమోదవుతుండటంతో ప్రభుత్వం టెస్టుల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. ఏప్రిల్‌ నెలలో మొత్తం 1,99,75,341 నమూనాలను పరీక్షించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments