Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రక్‌ను ఢీకొట్టిన టెంపో - 8 మంది దుర్మరణం (Video)

ఠాగూర్
సోమవారం, 13 జనవరి 2025 (10:04 IST)
నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ టెంపో వ్యాను ట్రక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రమాద స్థలిలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ప్రమాదంలో గాయపడిన వారిని సమీపంలోని జిల్లా, ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని నాసిక్ - ముంబై జాతీయ రహదారిపై ద్వారకా సర్కిల్ వద్ద ఈ ఘోరం జరిగింది. 
 
నిషాద్‌లో జిరగిన ఓ మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న 16 మంది తిరిగి టెంపోలో సిఐడీసీలో ప్రాంతానికి వెళుతుండగా వాహనం అదుపుతప్పింది. ఆ సమయంలో ఎదురుగా ఇనుప చువ్వలతో వస్తున్న ట్రక్కును టెంపో డ్రైవర్ ఢీకొట్టాడు. దీంతో ఆరుగురు అక్కడే చనిపోయారు. మరికొందరు తీవ్రగా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. దీంతో ప్రమాదంలో చనిపోయినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. అలాగే, గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్' : తన షెడ్యూల్‌ను పూర్తి చేసిన పవన్ కళ్యాణ్

Tamannaah: విరాట్ కోహ్లీ, అబ్ధుల్ రజాక్‌లతో అలాంటి రూమర్స్.. తమన్నా ఫైర్

యూనియన్లు కార్మికులనుంచి లక్షలు దోచేస్తున్నాయ్ : ఫిలిం ఛాంబర్ విమర్శ

పవన్ కళ్యాణ్ షూటింగ్ లో సినీ కార్మికుల ధర్నా - పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేసిన నిర్మాతలు

Sonakshi Sinha: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా థ్రిల్లర్ జటాధర.. థండరస్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

తర్వాతి కథనం
Show comments