Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 యేళ్ళ వృద్ధుడుకి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:41 IST)
సాధారణంగా కోటీశ్వరులకు కూడా నెలవారి కరెంట్ బిల్లు రాదు. ఇక సామాన్య ప్రజానీకానికి అయితే, వందలు లేదా వేలాది రూపాయల్లో వస్తుంది. వేసవిలో అయితే కాస్తంత ఎక్కువ మొత్తంలో వస్తుంది. అలాంటి ఓ సామాన్య వృద్ధుడుకి ఏకంగా రూ.80 కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయనకు గుండె ఆగిపోయినంతపని అయింది. కరెంట్‌ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్‌ తగిలింది. బీపీ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నలసోపార్ టౌన్‌కు చెందిన గణ్‌పత్‌ నాయక్‌ (80) అనే వృద్ధుడు స్థానికంగానే రైస్‌ మిల్లు నడుపుతున్నాడు. ఈ మిల్లుకు కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయన ఒకింత షాక్‌కు గురయ్యాడు. అది వేలల్లో కాదు ఏకంగా రూ.కోట్లల్లో కరెంట్‌ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంఎస్‌ఈడీసీఎల్‌) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరిచేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments