Webdunia - Bharat's app for daily news and videos

Install App

80 యేళ్ళ వృద్ధుడుకి రూ.80 కోట్ల కరెంట్ బిల్లు

Maharahstra
Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (12:41 IST)
సాధారణంగా కోటీశ్వరులకు కూడా నెలవారి కరెంట్ బిల్లు రాదు. ఇక సామాన్య ప్రజానీకానికి అయితే, వందలు లేదా వేలాది రూపాయల్లో వస్తుంది. వేసవిలో అయితే కాస్తంత ఎక్కువ మొత్తంలో వస్తుంది. అలాంటి ఓ సామాన్య వృద్ధుడుకి ఏకంగా రూ.80 కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయనకు గుండె ఆగిపోయినంతపని అయింది. కరెంట్‌ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్‌ తగిలింది. బీపీ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, నలసోపార్ టౌన్‌కు చెందిన గణ్‌పత్‌ నాయక్‌ (80) అనే వృద్ధుడు స్థానికంగానే రైస్‌ మిల్లు నడుపుతున్నాడు. ఈ మిల్లుకు కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయన ఒకింత షాక్‌కు గురయ్యాడు. అది వేలల్లో కాదు ఏకంగా రూ.కోట్లల్లో కరెంట్‌ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంఎస్‌ఈడీసీఎల్‌) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరిచేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది అని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'దండోరా' కోసం వేశ్యగా మారిన బిందు మాధవి

Kalyan Ram: ఆమె ఫారెస్ట్ బురదలో రెండుగంటలున్నారు : డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి

Bindu Madhavi: దండోరా మూవీలో వేశ్య పాత్రలో బిందు మాధవి ఎంట్రీ

Raviteja: ఎ.ఐ. టెక్నాలజీతో చక్రి గాత్రంతో మాస్ జాతరలో తు మేరా లవర్ సాంగ్ రిలీజ్

Nani: నా నుంచి యాక్షన్ అంటే ఇష్టపడేవారు హిట్ 3 చూడండి : నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

తర్వాతి కథనం
Show comments