Webdunia - Bharat's app for daily news and videos

Install App

సన్యాసినిగా మార్చేందుకు కుమార్తెను దానమిచ్చిన తల్లిదండ్రులు.. తర్వాత ఏం జరిగింది?

ఠాగూర్
ఆదివారం, 12 జనవరి 2025 (12:09 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్‌లో సోమవారం నుంచి మహా కుంభమేళా ప్రారంభంకానుంది. ఇందులో పాల్గొనేందుకు దేశం నలుమూలలకు చెందిన సాధుసన్యాసులు వస్తున్నారు. వివిధ అఖాడాలకు చెందిన సాధువులు త్రివేణి సంగమం ఒడ్డున టెంట్లు ఏర్పాటు చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 13 యేళ్ల బాలికను ఆమె తల్లిదండ్రులు ఓ సాధువుకు దానమిచ్చారు. తమ కూతురిని సన్యాసినిగా మార్చాలని కోరారు. వారి నుంచి దానం స్వీకరించిన సాధువు.. ఆ బాలికను తమ అఖాడాలో చేర్చుకుని సన్యాసినిగా మార్చారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మీడియా కూడా కథనాలు ప్రచురించింది. 
 
బాలిక రేఖకు జునా అఖాడాకు చెందిన మహంత్ కౌశల్ గిరి సన్యాసిని దీక్షను ప్రసాదించారు. ఈ విషయం తెలిసి జునా అఖాడా హెడ్ స్వామి అవదేశ్వరానంద్ గిరి జి మహారాజ్ స్పందించారు. 13 యేళ్ల బాలికను అఖాడాలో చేర్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని, బాలికకు సన్యాస దీక్ష ఇవ్వడమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. బాలికను దానంగా పుచ్చుకున్న మహంత్ కౌశల్ గిరిని, అఖాడాలో చేరి సన్యాస దీక్ష తీసుకున్న బాలిక రేఖను జునా అఖాడా నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇకపై వారిద్దరికీ అఖాదాతో ఎలాంటి సంబంధం ఉండదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments