Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికనేర్ వాసులను వణికించిన భూకంపం - రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (09:03 IST)
రాజస్థాన్ రాష్ట్రంలోని బికనేర్‌ సమీపంలో సోమవారం ఉదయం భూకంపం సంభవించింది. దీని తీవ్రత భూకంప లేఖినిపై 4.1గా నమోదైంది. బికనేర్ సమీప ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 2.01 గంటల సమయంలో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. భూమి కంపించడంతో గాఢ నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారి ఉలిక్కపడి లేచి తీవ్ర భయంతో వీధులు, రోడ్లపైకి పరుగులు తీశారు. 
 
బికనేర్ నగారనికి 236 కిలోమీటర్ల దూరంలో ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదైందని నేషనల్ సీస్మాలజీ కేంద్రం తెలిపింది. 10 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని బికనేర్ అధికారులు చెప్పారు. 
 
కాగా, శనివారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లక్నో సమీపంలో 82 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. శుక్రవారం కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పిఠోరాగడ్ ప్రాంతంలో భూమి కంపిచింది. అంతకుముందు జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోనూ ఈ భూప్రకంపనలు కనిపించాయి. ఈ వరుస భూకంపాలు పెద్ద భూకంపం వచ్చేందుకు ప్రమాద హెచ్చరికగా ప్రజలు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments