Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేసిన కిరాతకులు

Webdunia
ఆదివారం, 12 జూన్ 2022 (14:33 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కొందరు కామాంధులు తమ స్నేహితురాలిపై అత్యాచారం చేస్తూ లైవ్ స్ట్రీమింగ్ చేశారు. పైగా, ఈ విషయాన్న చెబితే ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పెడతామని హెచ్చరించారు. అప్పటి నుంచి గత యేడాదిగా ఆమెను బలవంతంగా అనుభవిస్తూ వచ్చారు. 
 
ఈ క్రమంలో ఆ యువతికి ఇటీవల నిశ్చితార్థం జరిగింది. దీంతో అత్యాచార వీడియోను సదరు వ్యక్తికి పంపించడంతో పెళ్లి రద్దు అయింది. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టగా, 2021 జూన్ 2వ తేదీన హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ సమయంలో వీడియోలు, ఫోటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారని తెలిపారు. 
 
ఈ విషయం గురించి బయటకు చెపితే తన తండ్రిని, సోదరుడిని చంపేస్తామని బెదిరించారని, దీంతో బాధితురాలు కొన్ని నెలలుగా మౌనంగా ఉన్నట్టు విచారణరో వెల్లడైంది. ప్రస్తుతం ఈ కేసులోని నిందితులు పరారీలో ఉండగా, వారికోసం పోలీసులు గాలిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments