Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. 
 
ఈ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని కన్నబిడ్డ తన బైకుపై కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. తల్లి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం డబ్బులు చెల్లించలేని ఆ యువకుడు.. చివరకు తన బైకునే మార్చురీ అంబులెన్స్‌గా చేసుకుని తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. 
 
ఇందుకోసం రూ.100 చెల్లించి ఓ చెక్క పలకలు కొని, దానిపై తల్లి మృతదేహాన్ని పడుకోబెట్టి, దాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడిటాలో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments