Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైకుపై తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లిన కుమారుడు.. ఎక్కడ?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (13:55 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిర్లక్ష్యం మరోమారు బట్టబయలైంది. ఇటీవలే సాగర్‌లో ఒకే సిరంజితో 30 మంది విద్యార్థులకు టీకాలు వేసిన ఘటన కలకలం రేపిన విషయం తెల్సిందే. తాజాగా మరో అమానవీయ ఘటన జరిగింది. 
 
ఈ రాష్ట్రంలోని షాదోల్ జిల్లాలోని ఓ ఆస్పత్రిలో చనిపోయిన తల్లి మృతదేహాన్ని కన్నబిడ్డ తన బైకుపై కట్టి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ స్వగ్రామానికి తరలించారు. తల్లి మృతదేహాన్ని ప్రైవేటు వాహనంలో తరలించేందుకు రూ.5 వేలు డిమాండ్ చేశారు. అంత మొత్తం డబ్బులు చెల్లించలేని ఆ యువకుడు.. చివరకు తన బైకునే మార్చురీ అంబులెన్స్‌గా చేసుకుని తల్లి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. 
 
ఇందుకోసం రూ.100 చెల్లించి ఓ చెక్క పలకలు కొని, దానిపై తల్లి మృతదేహాన్ని పడుకోబెట్టి, దాన్ని మోటార్ సైకిల్‌కు కట్టి తీసుకెళ్లారు. ఈ హృదయ విదారక దృశ్యాలను చూసిన కొందరు స్థానికులు వీడియో తీసి సోషల్ మీడిటాలో షేర్ చేయడంతో ఇది వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

1991లో వీరరాజు కు ఏం జరిగింది?

హైదరాబాద్‌ లో అల్లు అర్జున్‌ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పర్యవేక్షణలో అట్లీ

Ruchi Gujjar video రుచి గుజ్జర్ ఎద ఎత్తులపై ప్రధాని మోడి ఫోటోల దండ

Ratnam: వినోదంతో పాటు, సందేశం ఇవ్వాలనేది నా తపన : ఎ.ఎం. రత్నం

Pawan: మూర్తీభవించిన ధర్మాగ్రహం పవన్ కళ్యాణ్; ఐటంసాంగ్ వద్దన్నారు : ఎం.ఎం. కీరవాణి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments