Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువ ఐఏఎస్‌కు కరోనా వైరస్.. సెల్ఫ్ క్వారంటైన్‌కు కొలీగ్స్

Webdunia
శనివారం, 4 ఏప్రియల్ 2020 (10:43 IST)
కరోనా వైరస్ ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. కరోనా వైరస్ బారినపడిన వారికి సేవలు చేస్తున్న ఓ యువ ఐఏఎస్ అధికారిని కాటేసింది. దీంతో ఆయనతో పాటు ఉండే కార్యాలయ సిబ్బందితో పాటు కొలీగ్స్ అంతా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మధ్యప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఓ యువ ఐఏఎస్ అధికారి పనిచేస్తున్నారు. ఈయన కరోనా రోగులకు వైద్య సేవలు చేయించే పనుల్లో తీవ్రంగా నిమగ్నమయ్యారు. అయితే, ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల్లో కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. 
 
అంతేకాకుండా, ఆయనతో సన్నిహితంగా మెలిగిన సహోద్యోగులు, కుటుంబ సభ్యులు కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. వీరిలో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నట్టు సమాచారం. శుక్రవారం సాయంత్రం ఆరోగ్య శాఖకు చెందిన 120 మంది అధికారులు, సిబ్బంది నుంచి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షల కోసం పంపినట్టు ఓ సీనియర్ అధికారి మీడియాకు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కూలీలో నటించిన రిచ్ కార్మికులు రజనీకాంత్, ఆమిర్ ఖాన్ పారితోషికం ఎంతో తెలుసా?

Hansika : విడాకుల దిశగా హన్సిక అడుగులు వేస్తుందా !

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments