Webdunia - Bharat's app for daily news and videos

Install App

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఠాగూర్
సోమవారం, 10 మార్చి 2025 (10:00 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఎంహౌలోని జామా మసీదు ప్రాంతంలో ఆదివారం రాత్రి అల్లర్లు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులతో పాటు ఆర్మీ బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. ఆదివారం రాత్రి దుబాయ్ వేదికగా జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో భారత్ విజయం సాధించింది. 
 
ఈ విజయం తర్వాత భారత్‌లోని పలు ప్రాంతాల్లో క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో కొందరు అభిమానులు ఎంహౌలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ జామా మసీదుగా సాగింది. మసీదు ప్రాంతం నుంచి వెళుతుండగా సమీపంలోని గుంపు ర్యాలీపై రాళ్లు విసిరింది. ఇది రెండు వర్గాల మధ్య ఘర్షణకు కారణమైంది. ఈ సందర్భంగా పలు వాహనాలు ధ్వంసం చేశారు. రెండు దుకాణాలు, రెండు వాహనాలకు దుండగులు నిప్పుపెట్టారు. 
 
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆర్మీ సిబ్బంది కూడా అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గొడవ జరిగిన ప్రాంతం కంటోన్మెంట్ ఏరియా కావడంతో ప్రత్యేకంగా ఆర్మీ సిబ్బందిని మొహరించాల్సిన అవసరం లేకుండా పోయింది. కాగా, ఈ ఘర్షణల్లో ముగ్గురు గాయపడ్డారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని, దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు చెప్పారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments