Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత సైన్యం కొత్త అధ్యక్షుడుగా మనోజా పాండే

Webdunia
శనివారం, 30 ఏప్రియల్ 2022 (14:53 IST)
భారత కొత్త ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెట్ జనరల్ మనోజ్ పాండే నియమితులు కాగా, ఆయన శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆయన సైన్యాధ్యక్షుడి బాధ్యతలను ప్రస్తుత ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే అప్పగించారు. ఇప్పటివరకు జనరల్ మనోజ్ పాండే భారత ఆర్మీ ఉప చీఫ్‌గా పనిచేశారు. ఎంఎం నరవణే పదవీకాలం ముగియడంతో ఆయనకు పదోన్నతి కల్పించారు. 
 
కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్ విభాగం నుంచి ఆర్మీ చీఫ్ అయిన తొలి అధికారిగా జనరల్ మనోజ్ పాండే చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. గతంలో ఈ విభాగం నుంచి వైస్ చీఫ్ స్థానం వరకే రాగలిగారు. 1962 మే 6న జన్మించిన పాండే.. ఆర్మీకి 29వ అధిపతిగా పనిచేయనున్నారు. 62 ఏళ్ల వరకు లేదంటే మూడేళ్లు ఈ రెండింటిలో ఏది ముందే అయితే అప్పుటివరకు పదవిలో కొనసాగుతారని కేంద్రం వెల్లడించింది. 
 
కాగా, భారత్ పలు సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా, చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఆర్మీ చీఫ్‌గా మనోజ్ పాండే బాధ్యతలు చేపట్టారు. ఆర్మీ వైస్ చీఫ్ పదవిని మే 1న బీఎస్ రాజు చేపట్టనున్నారు. ఆర్మీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్‌‌గా ప్రస్తుతం రాజు పనిచేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ తెలుగు సీజన్-9‌లో కన్నడ నటి.. ఆమె ఎవరు?

సక్సెస్ మీట్‌లు నాకు అలవాటు లేదు.. పవన్ కళ్యాణ్

Harihara ban:: బేన్ చేయడానికి నా సినిమా క్విట్ ఇండియా ఉద్యమమా? పవన్ కళ్యాణ్ సూటి ప్రశ్న

హరిహర వీరమల్లు టాక్‌పై హైపర్ ఆది ఏమన్నారు?

Devarakonda, Sandeep reddy : కింగ్డమ్ బాయ్స్ ప్రచారానికి సిద్ధమయ్యారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

తర్వాతి కథనం
Show comments