Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాస్‌పోర్టులపై 'కమలం' గుర్తు - ఎందుకు అలా చేశామంటే?

Webdunia
శుక్రవారం, 13 డిశెంబరు 2019 (12:40 IST)
భారత ప్రభుత్వం జారీ చేసే పాస్ పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నారు. ఈ కమలం గుర్తు భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తు కావడంతో దీనిపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీంతో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. అదనపు భద్రతా చర్యల్లో భాగంగానే పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రిస్తున్నట్టు వివరణ ఇచ్చింది. 
 
కొత్త పాస్‌పోర్టులపై కమలం గుర్తును ముద్రించిన విషయమై లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ ఎంపీ ఎంకే రాఘవన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కేరళలోని కోళికోడ్‌లో ఈ పాస్‌పోర్టులను చేస్తున్నారని ఆయన కేంద్రంపై విమర్శలు చేశారు. ఎపుడూ లేనివిధంగా పాస్‌పోర్టులపై కమలం గుర్తు ఏంటంటూ ప్రశ్నించారు. ఈ చర్యపై సర్వత్రా విమర్శలు చెలరేగాయి. 
 
ఈ క్రమంలో వీటిపై విదేశాంగ శాఖ స్పందించింది. దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్.. కమలం అన్నది జాతీయ చిహ్నాల్లో ఒకటని.. అదనపు భద్రతా చర్యల్లో భాగంగా ఈ జాతీయ చిహ్నాన్ని ముద్రించామని అన్నారు. అంతర్జాతీయ పౌర విమానయాన సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ భద్రతా చర్యలు చేపట్టామని చెప్పుకొచ్చారు. ఇక వచ్చే నెలలో మరో జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తామని రవీష్ కుమార్ స్పష్టం చేశారు.  

సంబంధిత వార్తలు

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments