Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాముడు కూడా అత్యాచారాలను ఆపలేడు : బీజేజీ ఎమ్మెల్యే

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళ

Webdunia
ఆదివారం, 8 జులై 2018 (11:40 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సురేందర్ సింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఆ శ్రీరాముడు కూడా ఆపలేడనీ, పైగా అది సహజమని వ్యాఖ్యానించారు.
 
రోహానియా నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన సురేందర్‌ శనివారం ఓ సమావేశంలో మాట్లాడుతూ, మహిళలపై జరిగే అత్యాచారాలను రాముడు కూడా నివారించలేడు. ప్రతి ఒక్కరూ మహిళలను తమ కుటుంబ సభ్యులుగా, అక్కచెల్లెలుగా భావించాలి. అందరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే అఘాయిత్యాలను నివారించగలమని వ్యాఖ్యానించారు. 
 
కాగా, ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలు నయమని గతంలో ఈయనగారు సెలవిచ్చారు. ప్రభుత్వ అధికారులు డబ్బులు తీసుకుంటున్నారు కానీ, పనిచేయడం లేదని, వేశ్యలు డబ్బులు తీసుకున్నా డ్యాన్స్‌లు చేసి మనకు సంతోషం కలిగిస్తారంటూ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎక్కడ ఆ లం- కొడుకు? నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ బూతు కిరీటి అవుతున్నారా?

నాన్నగారి సంవత్సరికం తర్వాత మా పెళ్లి : నారా రోహిత్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments