రైల్వే భూమిని కబ్జా చేసిన హనుమంతుడు.. నోటీసులు జారీ!

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (07:34 IST)
సాధారణంగా ప్రభుత్వ, పరాయి వ్యక్తుల భూములు, కంటికి కనిపించే ఖాళీ స్థలాలను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తుంటారు. కానీ, ఇక్కడ రైల్వే స్థలాన్ని హనుమంత దేవుడు కబ్జా చేశాడు. అమ్మతోడు ఇది నిజం. ఆంజనేయ దేవుడు రైల్వే భూమిని ఆక్రమించారని, అందువల్ల ఆయన తక్షణం ఆ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ రైల్వే అధికారులు నోటీసులు మరీ జారీచేశారు. ఈ విచిత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. మురైనా జిల్లాలోని సబల్‌గఢ్‌లో కొత్త రైల్వే ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. గ్వాలియర్ - షియోపూర్ మధ్య ఏర్పాటు చేసే ఈ రైల్వే లైను నిర్మాణం కోసం స్థానికంగా ఉండే హనుమంతుడి ఆలయం అడ్డంగా వచ్చింది. దీంతో అధికారులు ఏమాత్రం వెనుకాముందు ఆలోచన చేయకుండా దేవుడు పేరిట నోటీసులు జారీచేశారు. 
 
కొత్తగా రైల్వే లైన్ వేస్తున్నాం కాబట్టి.. తక్షణం అక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ ఆంజనేయుడికి నోటీసులు పంపించారు. రైల్వే భూమిని హనుమంతుడు ఆక్రమించినట్టు పేర్కొన్నారు. ఈ నోటీసులను ఈ నెల 8వ తేదీన ఝాన్సీ రైల్వే డివిజన్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ జారీ చేశారు. 
 
ఈ నోటీసు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీన్ని చూసిన నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో మేల్కొన్న అధికారులు.. ఆలయ యజమానికి నోటీసులు ఇవ్వాలని, కానీ పొరపాటున జరిగినట్టు ఝాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ మాథూరు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Srinandu: పెళ్లి చూపులు అంత స్పెషల్ సినిమా సైక్ సిద్ధార్థ : సురేష్ బాబు

Catherine Tresa: సందీప్ కిషన్... అడ్వెంచర్ కామెడీ సిగ్మా లో కేథరీన్ థ్రెసా స్పెషల్ సాంగ్

నేను ఒక్కోసారి సినిమా రెమ్యూనరేషన్ కోల్పోతుంటా: పవన్ కల్యాణ్ పాత వీడియో

D. Suresh Babu: సినిమా వ్యాపారం వీధిలోకి వెళ్ళింది : డి. సురేష్ బాబు

akhanda 2 Update: అఖండ 2 విడుదల కాకపోవటంతో ఎగ్జిబిటర్స్ చాలా నష్టపోయారు : నట్టికుమార్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

తర్వాతి కథనం
Show comments