Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర మంత్రికి, ఆయన ఫ్యామిలీకి లుకౌట్ నోటీసులు

Webdunia
శుక్రవారం, 10 సెప్టెంబరు 2021 (11:24 IST)
రుణం తీసుకుని ఎగ్గొట్టిన కేసులో కేంద్ర మంత్రి కుటుంంబానికి లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. ఆ కేంద్ర మంత్రి ఎవరో కాదు.. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నారాయణ్ రాణె. ఈయన భార్య నీలమ్, ఎమ్మెల్యే అయిన వారి కుమారుడు నీతేశ్‌ రాణెలు దేశం విడిచి వెళ్లకుండా లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. 
 
దేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేసినట్టు పూణె పోలీసు అధికారులు తెలిపారు. నీలమ్, నీతేశ్‌లు తమకు చెందిన వివిధ సంస్థల తరపున ఓ ఫైనాన్షియల్ సంస్థ నుంచి తీసుకున్న రుణాల్లో దాదాపు రూ.61 కోట్ల మేర చెల్లించాల్సి ఉంది. 
 
రుణాలు పొందిన సమయంలో చూపిన రుణాల ఖాతాలను నిరర్థక ఆస్తులుగా పేర్కొనడంతో రుణాలిచ్చిన సంస్థ కేంద్రాన్ని ఆశ్రయించింది. దీంతో కేంద్రం నుంచి మహారాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఆదేశాలతో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్టు డిప్యూటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఘాడ్జ్ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి, బాలక్రిష్ణలకు IIFA ఉత్సవంలో ప్రత్యేక గౌరవం దక్కనుంది : ఆండ్రీ టిమ్మిన్స్

మత్తువదలరా పార్ట్ 3 కు ఐడియాస్ వున్నాయి కానీ... : డైరెక్టర్ రితేష్ రానా

టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ జానీపై పోక్సో కేసు!

బాలయ్య బెస్ట్ విషష్ తో హాస్యభరిత వ్యంగ చిత్రం పైలం పిలగా

శర్వానంద్, అనన్య, జై, అంజలి నటించిన జర్నీ రీ రిలీజ్‌కు సిద్ధమైంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments