Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం సిద్ధూకు లోకాయుక్త నోటీసులు.. 6న విచారణకు రావాలంటూ కబురు

ఠాగూర్
మంగళవారం, 5 నవంబరు 2024 (11:21 IST)
కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన విచారణకు రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొంది. మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ కేసులో ఈ నెల 6వ తేదీన విచారణకు హాజరుకావాలని లోకాయుక్త నోటీసుల్లో పేర్కొంది.

అలాగే, తనకు లోకాయుక్త పోలీసుల నుంచి నోటీసులు అందినట్టు సిద్ధరామయ్య కూడా వెల్లడించారు. అలాగే, నోటీసుల్లో పేర్కొన్నట్టుగా ఈ నెల 6వ తేదీన లోకాయుక్త ఎదుట హాజరవుతున్నట్టు చెప్పారు. ఇదే కేసులో ఆయన భార్య పార్వతిని గత నెల 25వ తేదీన విచారించిన విషయం తెల్సిందే. 
 
కాగా, బుధవారం ఉదయం లోకాయుక్త ఎదుట హాజరుకావాలని నోటీసులు ఇచ్చామని లోకాయుక్త సీనియర్ అధికారి ఒకరు ఓ వార్తా సంస్థకు వెల్లడించారు. సిద్ధరామయ్య భార్య పార్వతి సోదరులు కొంత భూమిని కొనుగోలు చేసి ఆమెకు బహుమతిగా ఇచ్చారు. ఈ భూమి వివాదంలో ఉండటంతో పోలీసులు సెప్టెంబరు 27వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ భూవివాదం ఇపుడు సీఎం సిద్ధరామయ్య మెడకు చుట్టుకోవడంతో పెద్ద చర్చనీయాంశంగా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments