Webdunia - Bharat's app for daily news and videos

Install App

18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

Webdunia
శనివారం, 16 జులై 2022 (20:59 IST)
ఈ నెల 18వ తేదీ నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు వీలుగా స్పీకర్ ఓం బిర్లా శనివారం అఖిలపక్ష నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీల ఎంపీలు సహకరించాలని ఆయన కోరారు. 
 
ముఖ్యంగా ప్రతి ఒక్క సభ్యుడు.. సభా మర్యాదలను ఖచ్చితంగా కాపాడాలని కోరారు. సమావేశాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ఆయన.. అన్ని పార్టీల నేతలకు వివరించారు. ఈ వర్షాకాల సమావేశాలు జులై 18న ప్రారంభమై.. ఆగస్టు 12న ముగుస్తాయని ఓం బిర్లా వెల్లడించారు. 
 
దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రస్తుతం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై చర్చలు జరపాలని అన్ని పార్టీల నేతలందరికీ విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. శనివారం సాయంత్రం ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష భేటీకి భాజపా నుంచి ప్రహ్లాద్ జోషి, అర్జున్ రామ్‌మేఘవాల్ పాల్గొన్నారు. 
 
అలాగే, కాంగ్రెస్ పార్టీ నుంచి అధిర్ రంజన్ చౌదరి, డీఎంకే, వైకాపా, ఆర్​ఎల్​జేపీ సహా పలు పార్టీల నేతలు హాజరయ్యారు. అయితే తెరాస మాత్రం అఖిలపక్ష సమావేశానికి దూరంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే ల కాంత నుంచి ఫస్ట్ సింగిల్

ఆది పినిశెట్టి, చైతన్య రావు నటించిన ఓటీటీ స్ట్రీమింగ్ మయసభ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments