ఏడు దశల్లో ఎన్నికలు -ఎలక్షన్ కోడ్ అమలు - దేశంలో 97 కోట్ల ఓటర్లు

SELVI.M
శనివారం, 16 మార్చి 2024 (16:39 IST)
EC
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ స్థానాలకు జరగనున్న ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేశారు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి రాజీవ్ కుమార్. ఎలక్షన్ షెడ్యూల్ రావడంతో నేటి నుంచే ఎలక్షన్ కోడ్ అమలులోకి వచ్చింది.
 
ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు ఈ కోడ్ వర్తించనుంది. రాజకీయ పార్టీలు, నేతలు ఎలక్షన్ కోడ్‌ను తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. కాగా.. ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. 
 
ఏడు దశల్లో పోలింగ్:
ఏప్రిల్ 19 - తొలిదశ ఎన్నికలు
ఏప్రిల్ 26 - రెండో దశ పోలింగ్
మే 7 - మూడో దశ పోలింగ్
మే 13 - నాలుగో దశ
మే 20 - ఐదో దశ పోలింగ్
మే 25 - ఆరో దశ పోలింగ్
జూన్ 1 - ఏడో దశ పోలింగ్
 
ఈ సందర్భంగా రాజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దేశంలో సుమారు 97 కోట్ల ఓటర్లు ఉన్నారన్నారు. వారిలో 49.7 మంది పురుషులు, 47.1 మహిళా ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అందులో కోటి 80 లక్షల మంది కొత్త ఓటర్లు ఉండటం గర్వించదగిన విషయమని చెప్పారు. దేశవ్యాప్తంగా 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలున్నాయని, ఎన్నికల విధుల్లో 1.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారని స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments