Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరువనంతపురంలో చేపల వ్యాపారికి కరోనా.. 119 మందికి సోకింది..

Webdunia
గురువారం, 9 జులై 2020 (18:15 IST)
కేరళ తిరువనంతపురంలో కరనా వైరస్‌ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదైంది కేరళలోని పుంథూరా, తిరువనంతపురం గ్రామాల నుంచే అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కాగా కేరళలోని సముద్ర తీర గ్రామం పుంథూరాలో 119 మందికి వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. 
 
ఈ 119 మందికి ఓ చేపల వ్యాపారి ద్వారా కరోనా సోకింది. దీంతో అతడి దగ్గర చేపలు కొన్న వారికి, అతడిని కలిసిన వారికి పరీక్షలు చేసి 119 మందికి వైరస్ సోకినట్లు గుర్తించారు. మరికొంత మంది పరీక్షల ఫలితాలు వెలువడాల్సి ఉంది. దీంతో అక్కడికి ఆరు ప్రత్యేక వైద్య బృందాలు చేరుకుని యుద్ధ ప్రాతిపదికన పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 
 
పుంథూరా సముద్ర తీర ప్రాంతం కావడంతో అక్కడ నివసిస్తున్న చాలా కుటుంబాలు చేపలు వేటాడి జీవనం సాగిస్తుంటాయి. చేపల విక్రయదారుడికి కరోనా నిర్ధారణ కావడంతో మిగిలిన వారిని కూడా చేపల వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ నవజోత్ ఖోసా మత్స్య కారులను ఆదేశించారు. గ్రామం మొత్తం శానిటైజ్ చేయాల్సి ఉందని వైద్య అధికారులు తెలిపారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

Comedian Ali: కమెడియన్ అలీ కూడా బెట్టింగ్ యాప్‌‌లో చిక్కుకున్నారా?

Uday Raj: 1990 నాటి టీనేజ్ లవ్ స్టోరీతో మధురం చిత్రం

Aamani : డొక్కా సీతమ్మ తో ఆమని కి అవార్డు రావాలి: మురళీ మోహన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments