Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది నిజంగానే చారిత్రక విజయం : బీజేపీ గెలుపు అద్వానీ

Webdunia
ఆదివారం, 26 మే 2019 (16:15 IST)
సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన విజయంపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎల్కే. అద్వానీ స్పందించారు. ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో పాల్గొన్న అద్వానీ తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. 
 
ఈ సందర్భంగా ఎల్కే.అద్వానీ స్పందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన ఫలితాలు చాలా సంతోషంగా ఉన్నాయన్నారు. ఇది నిజంగా చారిత్రక విజయమని అభివర్ణించారు. ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు చారిత్రాత్మక రీతిలో బీజేపీకి, దాని మిత్రపక్షాలకు మద్దతు ఇచ్చారన్నారు. ప్రజల తీర్పు పట్ల ఎన్డీయేలోని ప్రతి ఒక్కరూ ఆనందిస్తున్నారన్నారు. 
 
కాగా, ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అనంతరం, నరేంద్ర మోడీ నేరుగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకోవడం తెలిసిందే. బీజేపీ పార్లమెంటరీ నేత ఎన్నిక కార్యక్రమంలో కూడా ఇదే సీన్ పునరావృతమైంది. మోడీ మరోసారి బీజేపీ కురువృద్ధుడి దీవెనలు అందుకున్నారు.
 
కాగా, ఈ నెల 23వ తేదీన వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి 303 సీట్లు రాగా, ఎన్డీయే కూటమికి 353 సీట్లు వచ్చాయి. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ వరుసగా రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments