Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తర కాశీలో విషాదం.. పిడుగుపాటుకు 300 మేకలు మృతి

Webdunia
ఆదివారం, 26 మార్చి 2023 (13:37 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తర కాశీలో విషాదం చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఏకంగా 300 మేకలు మృతి చెందాయి. ఇంత భారీ సంఖ్యలో మేకలు చనిపోవడంట ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ విషయం తెలుసుకున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నష్ట నివారణ చర్యలు చేపట్టారు. 
 
ఉత్తరకాశీలోని ఖట్టు ఖాల్ అనే అటవీ ప్రాంతంలో పిడుగు పాటు కారణంగా ఏకంగా 350కి పైగా మేకలు చనిపోయాయి. శనివారం ఈ దుర్ఘటన జరిగింది. బర్సు గ్రామానికి చెందిన సంజీవ్ రావత్ అనే వ్యక్తితన స్నేహితుడితో కలిసి గొర్రెలు, మేకలను రిషికేష్ నుంచి ఉత్తరాశీకి తొలుకుని వెళుతున్న క్రమంలో పిడుగుపడింది. దీంతో 300కి పైగా మేకలు చనిపోయారు. 
 
మరోవైపు, ఈ విపత్తు గురించి తెలుసుకున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రమాదం జరిగిన ప్రాంతానికి ఓ బృందాన్ని పంపించి, నష్టాన్నిఅంచనా వేసి నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ తర్వాత బాధిత ప్రాంతానికి జిల్లా అధికార యంత్రాంగాన్ని పంపిస్తామని విపత్తుల నిర్వహణ విభాగం ప్రకటించింది. సాధారణంగా పిడుగుపాటుకు పొలాల్లో మేత మేసే పశువులు చనిపోతున్న సంఘటనలకు సంబంధించిన వార్తలు వచ్చాయి. కానీ ఇపుడు మేకలు చనిపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments