Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ ఆయుర్ధాయం మింగేసిన కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:19 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది ఈ మేరకు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌ (ఐఐపీఎస్‌) శాస్త్రవేత్తలు గణాంకపరమైన విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
 
మహమ్మారి కారణంగా జనన సమయంలో సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను ఇటు మహిళల్లోను తగ్గినట్లు ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక మేరకు 2019లో పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 ఏళ్లు కాగా.. మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. 2020లో అది 67.5 ఏళ్లు (పురుషులకు), 69.8 ఏళ్ల (మహిళలకు) తగ్గింది. 
 
కొవిడ్‌-19 మహమ్మారి.. 39-69 ఏళ్ల వయసున్న పురుషుల ప్రాణాలను ఎక్కువగా హరించింది. దీనివల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. 'ఏదో ఒక మహమ్మారి విజృంభించినప్పుడల్లా సగటు ఆయుష్షు తగ్గిపోతుంటుంది. ఆఫ్రికా దేశాలపై హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ విరుచుకుపడినప్పుడు కూడా ఇది క్షీణించింది. ఆ వ్యాధిని అదుపులోకి తెచ్చాక సగటు ఆయుర్దాయం మళ్లీ పుంజుకుంది' అని ఐఐపీఎస్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

గ్రీన్ టీ తాగితే కలిగే ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments