రెండేళ్ళ ఆయుర్ధాయం మింగేసిన కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:19 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది ఈ మేరకు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌ (ఐఐపీఎస్‌) శాస్త్రవేత్తలు గణాంకపరమైన విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
 
మహమ్మారి కారణంగా జనన సమయంలో సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను ఇటు మహిళల్లోను తగ్గినట్లు ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక మేరకు 2019లో పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 ఏళ్లు కాగా.. మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. 2020లో అది 67.5 ఏళ్లు (పురుషులకు), 69.8 ఏళ్ల (మహిళలకు) తగ్గింది. 
 
కొవిడ్‌-19 మహమ్మారి.. 39-69 ఏళ్ల వయసున్న పురుషుల ప్రాణాలను ఎక్కువగా హరించింది. దీనివల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. 'ఏదో ఒక మహమ్మారి విజృంభించినప్పుడల్లా సగటు ఆయుష్షు తగ్గిపోతుంటుంది. ఆఫ్రికా దేశాలపై హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ విరుచుకుపడినప్పుడు కూడా ఇది క్షీణించింది. ఆ వ్యాధిని అదుపులోకి తెచ్చాక సగటు ఆయుర్దాయం మళ్లీ పుంజుకుంది' అని ఐఐపీఎస్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Preethi Pagadala: సురేష్‌ బాబు సమర్పణలో కామెడీ స్పోర్ట్స్ డ్రామా పతంగ్‌ సిద్దం

'రాజాసాబ్' దర్శకుడు మారుతి మాటలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను ఉద్దేశించినవేనా?

ఐ బొమ్మ క్లోజ్, టికెట్ రూ. 99తో కలెక్లన్లు పెరిగాయి: బన్నీ వాస్, వంశీ

Shri Dharmendra : శ్రీ ధర్మేంద్ర గారి ఆత్మకు శాంతి చేకూరాలి : పవన్ కళ్యాణ్

Dharma Mahesh: హీరో ధర్మ మహేష్ ప్రారంభించిన జిస్మత్ జైల్ మందీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments