Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండేళ్ళ ఆయుర్ధాయం మింగేసిన కరోనా వైరస్

Webdunia
ఆదివారం, 24 అక్టోబరు 2021 (10:19 IST)
డ్రాగన్ కంట్రీ చైనాలో వెలుగు చూసిన కరోనా వైరస్ మనిషి జీవితాన్ని అనేక విధాలుగా అస్తవ్యస్తం చేసింది. ఈ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా భారత్‌లో సగటు ఆయుర్దాయం దాదాపు రెండేళ్ల మేర తగ్గింది ఈ మేరకు ముంబైలోని ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ స్టడీస్‌ (ఐఐపీఎస్‌) శాస్త్రవేత్తలు గణాంకపరమైన విశ్లేషణ చేసి ఈ విషయాన్ని గుర్తించారు.
 
మహమ్మారి కారణంగా జనన సమయంలో సగటు ఆయుర్దాయం అటు పురుషుల్లోను ఇటు మహిళల్లోను తగ్గినట్లు ఈ పరిశోధనలో తేలింది. ఈ నివేదిక మేరకు 2019లో పురుషుల సగటు ఆయుర్దాయం 69.5 ఏళ్లు కాగా.. మహిళల విషయంలో అది 72 ఏళ్లుగా ఉండేది. 2020లో అది 67.5 ఏళ్లు (పురుషులకు), 69.8 ఏళ్ల (మహిళలకు) తగ్గింది. 
 
కొవిడ్‌-19 మహమ్మారి.. 39-69 ఏళ్ల వయసున్న పురుషుల ప్రాణాలను ఎక్కువగా హరించింది. దీనివల్ల సగటు ఆయుర్దాయం పడిపోయింది. 'ఏదో ఒక మహమ్మారి విజృంభించినప్పుడల్లా సగటు ఆయుష్షు తగ్గిపోతుంటుంది. ఆఫ్రికా దేశాలపై హెచ్‌ఐవీ-ఎయిడ్స్‌ విరుచుకుపడినప్పుడు కూడా ఇది క్షీణించింది. ఆ వ్యాధిని అదుపులోకి తెచ్చాక సగటు ఆయుర్దాయం మళ్లీ పుంజుకుంది' అని ఐఐపీఎస్‌ డైరెక్టర్‌ కె.ఎస్‌.జేమ్స్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments