Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకపై మిగ్ 29 యుద్ధ విమానాల ల్యాండింగ్

Webdunia
మంగళవారం, 7 ఫిబ్రవరి 2023 (10:08 IST)
ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా మరో అరుదైన ఘనతను సాధించాం. దేశీయంగా తయారుచేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకపై మిగ్ 29 యుద్ధ విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. తద్వారా భారత్ తన సామర్థ్యాన్ని మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. స్వదేశీ టెక్నాలజీతో తయారు చేసిన తేలికపాటి యుద్ధ విమానాన్ని నేవీ అధికారులు విజయవంతంగా ల్యాండింగ్ చేశారు. 
 
స్వదేశీ యుద్ధ విమానాలు డిజైన్ చేయడంతో పాటు వాటిని పూర్తిస్థాయిలో తయారు చేసి స్వదేశీ టెక్నాలజీ తాయరు చేసిన యుద్ధ నౌకలపై సొంతంగా ల్యాడింగ్ చేసిన దేశంగా భారత్ అవతరించింది. ఇందులోభాగంగా, ట్రయల్స్ రన్‌ను నిర్వహించింది. ఇందులో తేజస్, మిగ్ 29కే లను భారత్ నేవీ ఐఎన్ఎస్ విక్రాంత్‌పై విజయవంతంగా ల్యాడింగ్ చేసింది. 
 
భారత దేశ చరిత్రలో ఇది అరుదైన మైలురాయిగా నిలిచిపోతుందని ఉన్నతాధికారులు వెల్లడించారు. రూ.20 వేల కోట్ల వ్యయంతో నిర్మించిన 45 వేల టన్నుల బరువున్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను గత యేడాది సెప్టెంబరు నెలలో భారత్‌ నేవీలో ప్రవేశపెట్టారు. ఐఎన్ఎస్ విక్రాంత్‌కు ఫైటర్ జెట్స్, విమానాలను దాదాపు 30 వరకు తీసుకెళ్లే సామర్థ్యం, సత్తా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments