Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసు సాగదీస్తే న్యాయవాదులకే లాభం : చీఫ్ జస్టిస్ చంద్రచూడ్

ఠాగూర్
మంగళవారం, 1 అక్టోబరు 2024 (10:57 IST)
కేసును సాగదీయడం వల్ల న్యాయవాదులకే లాభిస్తుందని ఓ దంపతులను ఉద్దేశించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. వైవాహిక బంధంలో వివాదాల వ్యవహారంలో సుదీర్ఘ న్యాయపోరాటం వల్ల న్యాయవాదులకే ప్రయోజనం కలుగుతుందని, కాబట్టి దంపతులు అవసరమైతే పరస్పర సమ్మతితో విడాకులకు అంగీకరించాలని ఆయన ఓ జంటకు సూచించారు.
 
తమ భార్యాభర్తల కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలని ఓ కేసులో మహిళ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా మహిళ ఏం చేస్తుందో సీజేఐ చంద్రచూడ్ అడిగి తెలుసుకున్నారు. తాను ఎంటెక్ పూర్తి చేశానని, అమెరికా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినట్లు కోర్టుకు తెలిపింది. ప్రస్తుతం తాను ఉద్యోగం ఏమీ చేయడం లేదని కూడా వెల్లడించింది.
 
మీరు మంచి విద్యావంతులు, కాబట్టి మొదట ఉద్యోగం సంపాదించుకోవాలని సూచించారు. అదేసమయంలో ఈ కేసులో మీరు పదేళ్లైనా న్యాయ పోరాటం చేయగలరేమో కానీ అలా చేయడం వల్ల న్యాయవాదులకు మాత్రమే ప్రయోజనం కలుగుతుందన్నారు. కాబట్టి పరస్పర సమ్మతితో విడాకులు తీసుకోవడానికి ఎందుకు అంగీకరించకూడదు? అందుకు మీరు సిద్ధపడితే మాత్రం కేసును క్లోజ్ చేస్తామన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

తర్వాతి కథనం
Show comments