Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేపథ్య గాయకుల రాణి లతా దీదీకి ఎవరికీ అందని రికార్డులు సొంతం

Webdunia
ఆదివారం, 6 ఫిబ్రవరి 2022 (11:06 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో 1929 సెప్టెంబరు 28వ తేదీన జన్మించిన నైటింగేల్ ఆఫ్ ఇండియా లతా మంగేష్కర్ ఇకలేరు. 92 యేళ్ల లతా దీదీ ఆదివారం ఉదయం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కన్నుమూశారు. అయితే, ఆమె ఒక గాయనిగా భారత సంగీతానికి 70 యేళ్లపాటు సేవ చేశారు. గాయనిగా ఎవరికీ అందని రికార్డులను సొంతం చేసుకున్నారు. ఆమె గానం చేసిన పాటలను దేశ ప్రజలు ఎన్నటికీ మరిచిపోలేరు. తన పాటలతో దేశ చరిత్రలో లతా మంగేష్కర్ స్థిరస్థాయిగా నిలిచిపోయారు. 
 
లతా దీదీ తల్లిదండ్రులు దీనానాథ్ మందేష్కర్, శుద్ధమతిలకు తొలి సంతానం. భారత గానకోకిల అనే బిరుదును సొంతం చేసుకున్న ఆమె తెలుగులో అనేక పాటలను ఆలపించారు. 1955లో అక్కినేని నాగేశ్వర రావు సినిమా "సంతానం"లో 'నిదుర పోరా తమ్ముడా' అనే పాటను తొలిసారి ఆలపించారు. 1965లో ఎన్టీఆర్ సినిమా "దొరికితే దొంగలు"లో 'శ్రీ వెంకటేశా' అనే పాటను 1988లో నాగార్జున "అఖరిపోరాటం" సినిమాలో 'తెల్లచీరకు తకదిమి' పాటను ఆలపించారు. 
 
ఈమె 70 యేళ్ల పాటు భారతీయ సినీ సంగీతానికి సేవలు అందించారు. 1948 నుంచి 1978 వరకు దాదాపు 30 వేలకు పైగా పాటలు పాడి, అన్ని పాటలు పాడిన ఏకైక గాయనిగా "గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌" పేరుతో చోటు దక్కించుకున్నారు. అనంతరం 1959లో టైమ్ మేగజైన్ కవర్ పేజీ స్టోరీగా లతా మంగేష్కర్ గురించి వ్యాసాన్ని ప్రచురించింది. ఆమెను భారతీయ నేపథ్య గాయకులు రాణిగా అభివర్ణించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments