Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాణా కుంభకోణం కేసు: లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష

దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిప

Webdunia
శనివారం, 24 మార్చి 2018 (12:28 IST)
దాణా కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్ తప్పలేదు. ఈ కేసులో రాంచీ కోర్టు లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. బీహార్ రాష్ట్రం దాణా కుంభకోణం నాలుగో కేసుపై విచారణ జరిపిన కోర్టు లాలూకి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. 
 
1995, 1996 సంవత్సరాల్లో దుంకా ట్రెజరీ నుంచి 3.13 కోట్ల రూపాయలు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలపడంతో పాటు ఇప్పటికే లాలూని దోషిగా నిర్ధారించిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఇందులో భాగంగా మార్చి 24 (శనివారం) ఏడేళ్ల శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇప్పటికే పూర్తయిన మూడు కేసుల్లోనూ లాలూకి శిక్ష పడింది. 
 
ప్రస్తుతం లాలూ జైలు జీవితం అనుభవిస్తున్నారు. మొదటి కేసులో ఐదేళ్లు, రెండో కేసులో మూడున్నర ఏళ్లు, మూడో కేసులో ఐదేళ్ల శిక్ష పడింది. నాలుగో కేసులో మాత్రం ఏడేళ్ల శిక్ష పడింది. ఇకపోతే, లాలూతో పాటు దాణా కుంభకోణం కేసులో మరో 31 మంది నిందితులుగా ఉన్నారు. బీహార్ మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా మాత్రం ఈ కేసులో నిర్ధోషిగా తేలారు. ఈ కేసులోనూ లాలూ దోషిగా తేలడంతో ఆయన ఇక ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments