Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:59 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోమారు దోషిగా తేలారు. మరో గడ్డి స్కామ్‌లో ఆయన దోషిగా నిలిచారు. ఈ మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చుతూ న్యాయమూర్తి సీకే షైని ఆదేశాలు జారీచేశారు. 
 
డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్ల అక్రమంగా తీసుకున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆయన కోర్టు బోనులోనే ఉన్నారు. అయితే, శిక్షను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఒకవేళ ఈ కేసులో మూడేళ్లకు మించి శిక్ష పడితే మాత్రం ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సివుంటుంది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు ఉచిత దాణా పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నిధులను ఇష్టానుసారంగా లాలూ ప్రభుత్వం విత్ డ్రా చేసి స్వాహా చేసింది. ఈ గడ్డి స్కాములో పలు కేసులు నమోదు కాగా, ఒక్కో కేసులో తీర్పును వెలువడుతూ వస్తుంది. తాజాగా ఐదో కేసులో తీర్పు వెలువడింది. కాగా, గత 2017 డిసెంబరు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments