Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూ ప్రసాద్ యాదవ్

Webdunia
మంగళవారం, 15 ఫిబ్రవరి 2022 (12:59 IST)
బీహార్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోమారు దోషిగా తేలారు. మరో గడ్డి స్కామ్‌లో ఆయన దోషిగా నిలిచారు. ఈ మేరకు జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ సీబీఐ ప్రత్యేక కోర్టు ఆయన్ను దోషిగా తేల్చుతూ న్యాయమూర్తి సీకే షైని ఆదేశాలు జారీచేశారు. 
 
డొరండా ట్రెజరీ నుంచి రూ.139 కోట్ల అక్రమంగా తీసుకున్న కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. ఆ సమయంలో ఆయన కోర్టు బోనులోనే ఉన్నారు. అయితే, శిక్షను మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఒకవేళ ఈ కేసులో మూడేళ్లకు మించి శిక్ష పడితే మాత్రం ఆయన తిరిగి జైలుకు వెళ్లాల్సివుంటుంది. 
 
ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశువులకు ఉచిత దాణా పేరుతో ఒక పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద నిధులను ఇష్టానుసారంగా లాలూ ప్రభుత్వం విత్ డ్రా చేసి స్వాహా చేసింది. ఈ గడ్డి స్కాములో పలు కేసులు నమోదు కాగా, ఒక్కో కేసులో తీర్పును వెలువడుతూ వస్తుంది. తాజాగా ఐదో కేసులో తీర్పు వెలువడింది. కాగా, గత 2017 డిసెంబరు నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ జైలు జీవితం గడుపుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mangli: పార్టీలో డ్రగ్స్, లిక్కర్ పై మంగ్లీ ఫస్ట్ రియాక్షన్

అహ్మదాబాద్ విమాన ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు

కోఆర్డినేషన్ కమిటీ వేయడాన్ని అభినందిస్తున్నాం : డా.ప్రతాని రామకృష్ణ గౌడ్

Gopichand's 33: గోపీచంద్, సంకల్ప్ రెడ్డి కాంబినేషన్ లో హిస్టారికల్ ఫిల్మ్

Pawn kalyan: ఆర్థిక ఇబ్బందులు, ఓటీటీ రూల్స్ వల్లే హరిహరవీరలమల్లు ఆలస్యం అవుతుందా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments