Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పూరు మఠాధిపతిగా 13 యేళ్ల బాలుడు

Webdunia
మంగళవారం, 28 సెప్టెంబరు 2021 (09:19 IST)
కర్నాటక రాష్ట్రంలో అనేక మఠాలు ఉన్నాయి. ఇలాంటి వాటిలో కుప్పూరు గద్దుగె మఠం ఒకటి. ఈ మఠానికి అధిపతిగా తేజస్‌ కుమార్‌ అనే 13 యేళ్ళ బాలుడు ఎంపికయ్యాడు. 
 
తుమకూరు జిల్లా చిక్కనాయనహళ్లి తాలూకాలో ఉన్న ఈ మఠానికి ఇప్పటివరకు అధిపతిగా ఉన్న యతీంద్ర శివాచార్య స్వామీజీ కొవిడ్‌ బారినపడి ఈ నెల 25వ తేదీన మృతి చెందిన విషయం తెల్సిందే. 
 
ఆయన మరణించే ముందు తన వారసునిగా తేజస్‌ కుమార్‌ పేరును ప్రకటించారు. మఠాధిపతికి అంత్యక్రియలు నిర్వహించేందుకు వారసుడు తప్పనిసరి కావడంతో బాలుడిని ఎంపిక చేశారు 
 
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి జె.సి.మాధుస్వామి, ఇతర మఠాల అధిపతులు, ఆధ్యాత్మికవేత్తల సమక్షంలో కొత్త మఠాధిపతి పేరు ప్రకటించారు. కొత్త మఠాధిపతి చేతుల మీదుగా యతీంద్ర శివాచార్య అంత్యక్రియలు జరిపించారు. 
 
ఎనిమిదో తరగతి చదువుతున్న తేజస్‌ కుమార్‌ 2008, ఏప్రిల్‌ 22న జన్మించారు. మైసూరు సుత్తూరు మఠంలో తన విద్యాభ్యాసాన్ని కొనసాగించే అవకాశముంది. అలాగే, మఠం కార్యకలాపాలను మరో వ్యక్తి చేసుకునే అవకాశం ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు.. ఎందుకో తెలుసా?

Vijayashanti: అర్జున్ S/O వైజయంతి తర్వాత విజయశాంతి సినిమాలు చేయదా?

Anasuya Bharadwaj: అరి చిత్రానికి కష్టాలు- రిలీజ్‌ ను ఆపుతుంది ఎవరు?

Tamannaah : ముంబైలో తమన్నా భాటియా ఓదెల 2 ట్రైలర్ లాంచ్ కాబోతోంది

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments