Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే.. రైతు రుణాలను మాఫీ చేస్తాం: కుమారస్వామి హామీ

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండిం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:27 IST)
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండించిన పంటలకు కూడా మద్దతు ధర లభించలేదన్నారు. 
 
కంది రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూసినా ఫలితం లేక చివరకు ఈ పంట కొనుగోళ్ల మాఫియాకు బలైనట్లు కుమార స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ద్రాక్ష, నిమ్మ రైతులు రుణాల ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే రూ.58 వేల కోట్ల విలువైన పంట నష్టమైందని కుమారస్వామి లెక్కగట్టారు. జాతీయ బ్యాంకులలో చేసిన వేలాది కోట్ల రుణాలు మేము అధికారంలోనికి వచ్చిన తక్షణమే మాఫీ చేస్తామని తెలిపారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారని.. పదేళ్లుగా విసిగి వేసారిన ప్రజలు జేడీఎస్‌ పాలన కోసం వేచి చూస్తున్నారని కుమారస్వామి చెప్పారు. రైతులతో పాటు మహిళలకు తమ పార్టీ అండగా వుంటుందని, స్త్రీ శక్తి సంఘాలకు వడ్డీ రహిత రుణాలతో పాటు ఇప్పటి వరకు చేసిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments