Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే.. రైతు రుణాలను మాఫీ చేస్తాం: కుమారస్వామి హామీ

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండిం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:27 IST)
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండించిన పంటలకు కూడా మద్దతు ధర లభించలేదన్నారు. 
 
కంది రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూసినా ఫలితం లేక చివరకు ఈ పంట కొనుగోళ్ల మాఫియాకు బలైనట్లు కుమార స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ద్రాక్ష, నిమ్మ రైతులు రుణాల ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే రూ.58 వేల కోట్ల విలువైన పంట నష్టమైందని కుమారస్వామి లెక్కగట్టారు. జాతీయ బ్యాంకులలో చేసిన వేలాది కోట్ల రుణాలు మేము అధికారంలోనికి వచ్చిన తక్షణమే మాఫీ చేస్తామని తెలిపారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారని.. పదేళ్లుగా విసిగి వేసారిన ప్రజలు జేడీఎస్‌ పాలన కోసం వేచి చూస్తున్నారని కుమారస్వామి చెప్పారు. రైతులతో పాటు మహిళలకు తమ పార్టీ అండగా వుంటుందని, స్త్రీ శక్తి సంఘాలకు వడ్డీ రహిత రుణాలతో పాటు ఇప్పటి వరకు చేసిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments