Webdunia - Bharat's app for daily news and videos

Install App

అధికారంలోకి వస్తే.. రైతు రుణాలను మాఫీ చేస్తాం: కుమారస్వామి హామీ

కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండిం

Webdunia
శుక్రవారం, 4 మే 2018 (15:27 IST)
కర్ణాటకలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన 24 గంటల్లో రైతుల రుణాలను మాఫీ చేస్తామని జనతాదళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి స్పష్టం చేశారు. మూడేళ్లలో 3,800కు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. వారు పండించిన పంటలకు కూడా మద్దతు ధర లభించలేదన్నారు. 
 
కంది రైతులు ప్రభుత్వ ప్రకటన కోసం వేచి చూసినా ఫలితం లేక చివరకు ఈ పంట కొనుగోళ్ల మాఫియాకు బలైనట్లు కుమార స్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ద్రాక్ష, నిమ్మ రైతులు రుణాల ఉచ్చులో చిక్కుకున్నారన్నారు. ఇప్పటికే రూ.58 వేల కోట్ల విలువైన పంట నష్టమైందని కుమారస్వామి లెక్కగట్టారు. జాతీయ బ్యాంకులలో చేసిన వేలాది కోట్ల రుణాలు మేము అధికారంలోనికి వచ్చిన తక్షణమే మాఫీ చేస్తామని తెలిపారు. 
 
కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరుతో ప్రజలు విసిగిపోయారని.. పదేళ్లుగా విసిగి వేసారిన ప్రజలు జేడీఎస్‌ పాలన కోసం వేచి చూస్తున్నారని కుమారస్వామి చెప్పారు. రైతులతో పాటు మహిళలకు తమ పార్టీ అండగా వుంటుందని, స్త్రీ శక్తి సంఘాలకు వడ్డీ రహిత రుణాలతో పాటు ఇప్పటి వరకు చేసిన రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments