Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర అడిగితే బస్సు నుంచి దించేశాడు.. 12కి.మీ నడిచిన విద్యార్థిని

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:10 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఏర్పడింది. ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సంఘటన జరిగిన రోజు తన ఇంటికి చేరుకోవడానికి నేదురుమంగడు డిపోలో ప్రభుత్వ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుండగా విద్యార్థిని కండెక్టర్‌కు వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంది. 
 
విద్యార్థికి టికెట్‌ ఇచ్చిన కండక్టర్‌ చిల్లర ఇవ్వలేదు. తర్వాత ఇస్తానని చెప్పాడు. రెండు మూడుసార్లు అడిగినా కండక్టర్ విద్యార్థినికి చిల్లర ఇవ్వలేదు. ఆ విద్యార్థిని పదే పదే అడగడంతో ఆవేశానికి గురైన కండక్టర్ విద్యార్థిని దూషించి అవమానించాడు. అంతేగాకుండా విద్యార్థినిని బలవంతంగా బస్సు నుండి దించాడు. విద్యార్థిని వద్ద వేరే డబ్బు లేకపోవడంతో మరో బస్సులో ఇంటికి వెళ్లలేకపోయింది. 
 
కన్నీళ్లతో సంఘటనా స్థలం నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం విద్యార్థిని తండ్రి సంబంధిత బస్ డిపోకు వెళ్లి కండక్టర్‌ను నిలదీశాడు. దీంతో కండక్టర్ విద్యార్థిని తండ్రిని అనుచిత పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు ట్రాఫిక్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నన్ను ఎవరూ నమ్మని రోజు ఎస్.కేఎన్ నమ్మాడు : బేబి డైరెక్టర్ సాయి రాజేశ్

కింగ్‌డమ్ హిట్ అయితే ఆనందం కంటే సీక్వెల్ పై బాధ్యత పెరిగింది : విజయ్ దేవరకొండ

Sreeleela: భగవంత్ కేసరి గర్జించేలా చేసిన ప్రతి కూతురికి, అందరికీ థ్యాంక్స్.. శ్రీలీల

Bhagavanth Kesari: జాతీయ చలనచిత్ర పురస్కార విజేతలకు అభినందనలు-పవన్ కళ్యాణ్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments