Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిల్లర అడిగితే బస్సు నుంచి దించేశాడు.. 12కి.మీ నడిచిన విద్యార్థిని

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:10 IST)
కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం సమీపంలో ఓ విద్యార్థినికి చేదు అనుభవం ఏర్పడింది. ప్రభుత్వ బాలికల హయ్యర్‌ సెకండరీ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని సంఘటన జరిగిన రోజు తన ఇంటికి చేరుకోవడానికి నేదురుమంగడు డిపోలో ప్రభుత్వ బస్సు ఎక్కింది. అక్కడి నుంచి బస్సు బయలుదేరుతుండగా విద్యార్థిని కండెక్టర్‌కు వంద రూపాయలు ఇచ్చి టికెట్ తీసుకుంది. 
 
విద్యార్థికి టికెట్‌ ఇచ్చిన కండక్టర్‌ చిల్లర ఇవ్వలేదు. తర్వాత ఇస్తానని చెప్పాడు. రెండు మూడుసార్లు అడిగినా కండక్టర్ విద్యార్థినికి చిల్లర ఇవ్వలేదు. ఆ విద్యార్థిని పదే పదే అడగడంతో ఆవేశానికి గురైన కండక్టర్ విద్యార్థిని దూషించి అవమానించాడు. అంతేగాకుండా విద్యార్థినిని బలవంతంగా బస్సు నుండి దించాడు. విద్యార్థిని వద్ద వేరే డబ్బు లేకపోవడంతో మరో బస్సులో ఇంటికి వెళ్లలేకపోయింది. 
 
కన్నీళ్లతో సంఘటనా స్థలం నుంచి 12 కిలోమీటర్ల దూరం నడిచి ఇంటికి చేరుకుంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. అనంతరం విద్యార్థిని తండ్రి సంబంధిత బస్ డిపోకు వెళ్లి కండక్టర్‌ను నిలదీశాడు. దీంతో కండక్టర్ విద్యార్థిని తండ్రిని అనుచిత పదజాలంతో దూషించాడు. ఈ ఘటనపై యువతి తల్లిదండ్రులు ట్రాఫిక్ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pradeep: నటుడిగా గేప్ రావడానికి ప్రధాన కారణం అదే : ప్రదీప్ మాచిరాజు

షిర్డీ సాయిబాబా ఆలయాన్ని సందర్శించిన మోహన్ బాబు (video)

Prabhas: రాజా సాబ్ అందుకే ఆలస్యమవుతోందని తేల్చి చెప్పిన డైరెక్టర్ మారుతి

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments