Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాలాంటివారిని వాడుకోవడం లేదు .. అందుకే వీడుతున్నా.. సోనియాకు ఖుష్బూ లేఖ

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (13:04 IST)
తమిళ సినీ నటి ఖుష్బూ కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పేశారు. ఆమె పార్టీని వీడుతూ, తన మనసులోని మాటలను లేఖ రూపంలో బహిర్గతం చేశారు. ముఖ్యంగా, పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి ఓ లేఖ రాశారు. ఇందులో తాను పార్టీని ఎందుకు వీడుతున్నారో వివరించారు. తనలాంటి వారిని కొందరు నేతలు అణిచివేస్తున్నారనీ, వాస్తవ పరిస్థితికి పార్టీలోని పరిస్థితికి భిన్నంగా ఉందని వాపోయారు. 
 
ముఖ్యంగా, 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి అనంతరం తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని ఆమె చెప్పారు. తాను ప్రజల కోసం పనిచేసేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పుకొచ్చారు. అంతేగానీ, పేరు, ప్రతిష్టల కోసం కాదని గుర్తుచేశారు. 
 
అయితే, కాంగ్రెస్ పార్టీలో కొన్ని శక్తులు తనను అణచివేశాయని, ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సహకరించిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు చెబుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 
 
కాగా, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఖుష్బూ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇందుకోసం ఆమె సోమవారం హస్తినకు చేరుకుని, బీజేపీ పెద్దలను కలుసుకున్న తర్వాత ఆమె కమలదళం సభ్యత్వం స్వీకరించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments