Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలకు బీజేపీ మేలు చేస్తోందన్న ఐయూఎంఎల్ నేత.. క్షణాల్లో పదవి ఊడింది...

భారతీయ జనతా పార్టీపై ప్రశంసల వర్షం కురిపించినందుకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మహిళా విభాగం చీఫ్ కమరున్నీసా పదవి ఊడిపోయింది. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను పదవి నుంచి

Webdunia
ఆదివారం, 7 మే 2017 (12:44 IST)
భారతీయ జనతా పార్టీపై ప్రశంసల వర్షం కురిపించినందుకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) మహిళా విభాగం చీఫ్ కమరున్నీసా పదవి ఊడిపోయింది. కేవలం బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేసినందుకే ఆమెను పదవి నుంచి తొలగించారు. 
 
కేరళ రాష్ట్రంలోని తిరూర్‌లోని ఆమె ఇంటికి విరాళం కోసం బీజేపీ కార్యకర్తలు వెళ్లారు. అపుడు ఆమె వారితో మాట్లాడుతూ కేరళ, తదితర రాష్ట్రాల్లో బీజేపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. బీజేపీ ప్రజలకు మేలు చేయగలదని, రాష్ట్రాభివృద్ధికి కృషి చేయగలదని భావిస్తున్నారని తన మనసులోని మాటను వెల్లడించింది. ఈ విషయంలో తమకు ఎన్నో ఆశలు ఉన్నాయని తెలిపారు. బీజేపీకి విరాళం ఇవ్వడానికి ముందు తాను ఐయూఎంఎల్ అగ్ర నేత నుంచి అనుమతి తీసుకున్నట్లు చెప్పారు.
 
ఈ వ్యాఖ్యలు వివాదం రేపడంతో ఐయూఎంఎల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే వివరణ ఇవ్వాలని కమరున్నీసాను కోరింది. ఆమె క్షమాపణ చెప్పినప్పటికీ పార్టీ మహిళా విభాగం చీఫ్ పదవి నుంచి ఆమెను తొలగించింది. ఇది కేరళ రాష్ట్రంలో సంచలనంగా మారింది.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments