Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో కరోనాకు కొత్త పద్ధతి.. ప్లాస్మా థెరపీకి రంగం సిద్ధం..

Webdunia
శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (16:20 IST)
కేరళలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  కరోనా అనుమానిత కేసులు 286 నమోదవగా..వీటిలో 256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఇక కోవిడ్-19 కారణంగా విషమ పరిస్థితుల్లో వున్న రోగులకు ప్లాస్మా థెరపీ ద్వారా మళ్ళీ ఆరోగ్యవంతులను చేసేందుకు కేరళ ప్రభుత్వం నడుం కట్టింది. 
 
అయితే ఈ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నవారి రక్తంలోని యాంటీ బాడీలను వినియోగించుకోవలసి ఉంటుంది. ఈ థెరపీ క్లినికల్ ట్రయల్స్‌కు శ్రీకారం చుట్టిన కేరళ ఈ తరహా ప్రయోగానికి దేశంలోనే తొలి రాష్ట్రంగా నిలిచింది. ఈ ప్రాజెక్టుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆమోదం తెలిపిందని అధికారి ఒకరు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్స్‌టి‌ట్యూట్ ఫర్ మెడికల్ అండ్ సైన్సెస్ టెక్నాలజీ ఈ దిశగా ప్రయోగాలు చేపడుతుందని కేరళ ప్రభుత్వాధికారి తెలిపారు. ఈ నెలాఖరు నుంచి ట్రయల్స్ ప్రారంభిస్తుందన్నారు. 
 
ఇప్పటికే ప్లాస్మా థెరపీకి సంబంధించి చైనా, అమెరికా దేశాల్లో కొంత అధ్యయనం జరిగింది. కానీ ఈ చికిత్సా విధానం బాగా పని చేస్తుందని ఇప్పుడే చెప్పలేమని కేరళ ప్రభుత్వాధికారి తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గీతానంద్-మిత్రా శర్మ ప్రధాన పాత్రల్లో రొమాంటిక్ కామెడీ గా వస్తున్న వర్జిన్ బాయ్స్!

Nani: నాని, శ్రీనిధి శెట్టి లపై HIT: The 3rd Case నుంచి రొమాంటిక్ సాంగ్

శర్వానంద్, సంయుక్త లపై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

NTR: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం తాజా అప్ డేట్ - ఏప్రిల్ 22న సెట్స్‌లో ఎంట్రీ

కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్‌ను విడుదల చేసిన యోగి ఆదిత్యనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments