Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళలో ఖాతా తెరవని కాషాయం పార్టీ : మెట్రోమ్యాన్‌కు తప్పని ఓటమి!

Webdunia
ఆదివారం, 2 మే 2021 (17:25 IST)
కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆ రాష్ట్ర ఓటర్లు దిమ్మ‌దిరిగే షాకిచ్చారు. ఎన్నిక‌ల‌కు ముందు కేర‌ళ‌లో 35 స్థానాలు గెలుస్తామ‌ని ప్ర‌గ‌ల్భా ప‌లికిన ఆ పార్టీ క‌నీసం ఖాతా కూడా తెర‌వ‌లేక‌పోయింది. 
 
ఇంత‌కుముందు ఉన్న ఒక్క స్థానం కూడా కోల్పోవ‌డం గ‌మ‌నార్హం. బీజేపీ త‌న సిట్టింగ్ స్థానం నెమోమ్‌లో కూడా కోల్పోయింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు కె.సురేంద్ర‌న్ స‌హా న‌టుడు సురేశ్ గోపీ, మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్ కూడా ఓట‌మి పాల‌య్యారు.
 
నెమోమ్ స్థానంలో మొద‌ట బీజేపీ అభ్య‌ర్థి రాజ‌శేఖ‌ర‌న్ ఆధిక్యంలో నిలిచినా.. త‌ర్వాత మూడోస్థానానికి ప‌రిమితమ‌య్యారు. ఈ స్థానం నుంచి ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి శివ‌న్‌కుట్టీ 2025 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. అటు మెట్రోమ్యాన్ శ్రీధ‌ర‌న్‌ను పాల‌క్క‌డ్ స్థానంలో ఎల్డీఎఫ్ అభ్య‌ర్థి ష‌ఫీ పారంబిల్ 2657 ఓట్ల తేడాతో ఓడించారు. 
 
అటు త్రిస్సూర్‌లో మొద‌ట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివ‌రికి మూడోస్థానంతో స‌రిపెట్టుకున్నారు. ఈ మూడు స్థానాల్లో బీజేపీ గెలుస్తుంద‌ని భావించినా చివ‌రి రౌండ్ల‌లో ఆ పార్టీ అభ్య‌ర్థులు దారుణంగా ఓడిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాక్షస టైటిల్ సాంగ్ లాంచ్, రిలీజ్ డేట్ ఫిక్స్

రామ్ మధ్వాని ది వేకింగ్ ఆఫ్ ఎ నేషన్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

29 మిలియన్ వ్యూస్‌తో నెం.1 ప్లేస్‌లో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ టీజర్

బుక్ మై షోలో తల మూవీ టికెట్ ను కొన్న నాగార్జున

పవన్ కళ్యాణ్ బాగా ఎంకరేజ్ చేస్తారు.. ఆయన నుంచి అది నేర్చుకోవాలి : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

మొక్కజొన్న పిండిని వంటల్లోనే కాదు.. ముఖానికి ఫేస్ మాస్క్‌లా వాడితే?

Valentine's Day 2025: నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. ఐ లవ్ యు అని చెప్పడానికి?

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments