ఢిల్లీలో మరోసారి లాక్ డౌన్, హోలీ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించే యోచనలో కేజ్రీవాల్‌

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (21:59 IST)
న్యూఢిల్లీ: దేశంలో మరోసారి కరోనా విజృంభిస్తోంది. నవంబర్‌ నుంచి కోవిడ్‌ కేసులు తగ్గినప్పటికి.. గత కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధించగా.. తాజాగా దేశ రాజధాని ఢిల్లీ కూడా ఈ జాబితాలో చేరింది.
 
 రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు లాక్‌డౌన్‌ విధించేందుకు కేజ్రీవాల్‌ ప్రభుత్వం సిద్ధమయ్యింది. త్వరలో రానున్న హోలీ పండగ నేపథ్యంలో లాక్‌డౌన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు‌ కనిపిస్తున్నాయి. ఈ నెల 28న హోలీ ఉండటంతో.. కఠిన ఆంక్షలకు విధించాలని సర్కార్ సిద్ధమైంది. ఈ క్రమంలో మార్చి 28 నుంచి 30 వరకు లాక్‌డౌన్‌ విధించాలని సూచించారు అధికారులు.
 
ఇక ఢిల్లీలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. వారం రోజుల వ్యవధిలోనే 4,288 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో విపత్తు నిర్వహణ అథారిటీ కాసేపట్లో సమావేశం కానుంది. పెరుగుతున్న కోవిడ్ కేసులపై జరగనున్న చర్చించనుంది. ఈ సమావేశానికి లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంతో పాటు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశం తర్వాత లాక్‌డౌన్‌పై క్లారిటీ వచ్చే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కోవిడ్‌ గురించి జనాలను హెచ్చరిస్తోంది. టీకా తీసుకోవాలని.. జాగ్రత్తలు పాటించాలని కోరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్- రజనీ సినిమా నుంచి సుందర్ సి అవుట్.. కాలుజారిన రజనీ.. అదే కారణమా?

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments