కంచిలో గల అత్తి వరద రాజు స్వామి వారిని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామి వారికి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు.
అంతకుముందు సీఎం శ్రీ కేసీఆర్ దేవస్థానానికి చేరుకోగానే ఆలయ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికారు. అత్తివరద స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోడానికి సంబంధించిన వీడియో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారిక సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.