Webdunia - Bharat's app for daily news and videos

Install App

భార్యభర్తలమని నమ్మించి లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు... ఆపై...

Webdunia
సోమవారం, 12 ఆగస్టు 2019 (15:47 IST)
వారిద్దరీ అక్రమ సంబంధం. శారీరకంగా కలుసుకునేందుకు వారిద్దరికీ వీలుపడలేదు. దీంతో ఓ లాడ్జీకెళ్లి భార్యాభర్తలమని నమ్మించి ఓ గదిని అద్దెకు  తీసుకున్నారు. చివరకు మహిళ మాత్రం ఫ్యానుకు ఉరిగా వేలాడగా, ఆమెతో లాడ్జీకి వచ్చిన వ్యక్తి మాత్రం పారిపోయాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలోని పెరియమేట్లో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, స్థానిక పెరియమేడు వీవీ కోయిల్‌ వీధిలోని ఓ లాడ్జిలో భార్య భర్తలంటూ ఓ జంట అద్దెకు రూమ్‌ తీసుకుంది. శనివారం రాత్రి ఎంత సేపటికీ ఆ జంట బయటకు రాకపోవడంతో అనుమానించిన లాడ్జి సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి చూడగా, అందులో మహిళ మాత్రం ఉరికంబానికి వేలాడుతూ కనిపించింది. ఆపై రూమ్‌లో ఆమె భర్త కనిపించక పోవడంతో పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీంతో స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు విచారణ చేపట్టారు. ఈ విచారణలో మృతురాలు కొరుకుపేట రైల్వే స్టేషన్‌లో పనిచేసే మోహనగా గుర్తించారు. భర్త నుంచి విడిపోయిన ఆమె తిరువొట్రియూరు రైల్వే క్వార్టర్స్‌లో ఒంటరిగా జీవిస్తోందని, రైల్వే స్టేషన్‌ క్యాంటీన్‌‌లో పనిచేస్తున్న కడలూర్‌కు చెందిన వీరాస్వామితో మోహనకు పరిచయం ఏర్పడిందని, వారి పరిచయం వివాహేతర సంబంధంగా మారడంతో తరచూ అతను మోహన ఇంటికి వచ్చివెళ్లే వాడని తెలిసింది. స్థానికులు ఈ జంటపై అనుమానించడంతో మోహన తన ఇంటికి రావద్దని వీరాస్వామిని మందలించింది. ఈక్రమంలోనే వారిద్దరూ లాడ్జీలో గదిని అద్దెకు తీసుకుని శారీరకంగా కలుస్తూ వచ్చినట్టు తేలింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments