Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబా పాదాల వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూనే ఓ భక్తుడు దైవం చెంతకు చేరుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ మేహానీ అనే భక్తుడు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలో పాల్గొన్న అనంతరం బాబా విగ్రహం పాదాల వద్ద కూర్చొని దైవాన్ని ప్రార్థిస్తూనే ప్రాణాలు విడిచాడు. 
 
బాబా పాదాల వద్ద తలవాల్చి కూర్చొన్న రాజేశ్.. ఎంత సేపటికి పైకి లేవకపోవడంతో తోటి భక్తులు పూజారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి రాజేశ్‌ను కదపగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా, రాజేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆలయ ప్రార్థన సమయంలోనే రాజేశ్‌కు నిశ్శబ్ద గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
స్థానికంగా మెడికల్ షాపును నడుపుతున్న రాజేశ్.. ప్రతి గురువారం స్థానికంగా ఉండే సాయిబాబా గుడికి క్రమం తప్పకుండా వచ్చి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన మృతి చెందారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇపుడు సోషల్ మీడియాలో వైరలైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments