Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాయిబాబా పాదాల వద్ద గుండెపోటుతో భక్తుడి మృతి... ఎక్కడ?

Webdunia
సోమవారం, 5 డిశెంబరు 2022 (16:44 IST)
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కట్నీ పట్టణంలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూనే ఓ భక్తుడు దైవం చెంతకు చేరుకున్నాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, రాజేశ్ మేహానీ అనే భక్తుడు స్థానిక సాయిబాబా ఆలయంలో పూజలో పాల్గొన్న అనంతరం బాబా విగ్రహం పాదాల వద్ద కూర్చొని దైవాన్ని ప్రార్థిస్తూనే ప్రాణాలు విడిచాడు. 
 
బాబా పాదాల వద్ద తలవాల్చి కూర్చొన్న రాజేశ్.. ఎంత సేపటికి పైకి లేవకపోవడంతో తోటి భక్తులు పూజారికి సమాచారం అందించారు. ఆయన వచ్చి రాజేశ్‌ను కదపగా ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించగా, రాజేశ్ అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఆలయ ప్రార్థన సమయంలోనే రాజేశ్‌కు నిశ్శబ్ద గుండెపోటు వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. 
 
స్థానికంగా మెడికల్ షాపును నడుపుతున్న రాజేశ్.. ప్రతి గురువారం స్థానికంగా ఉండే సాయిబాబా గుడికి క్రమం తప్పకుండా వచ్చి తన ఇష్టదైవాన్ని ప్రార్థిస్తుంటాడు. ఈ క్రమంలోనే ఆయన మృతి చెందారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇపుడు సోషల్ మీడియాలో వైరలైంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments