Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ నోటి నుంచి ఒక్క మాట రాలేదు..

Webdunia
శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:03 IST)
భాజపా కురువృద్ధుడు లాల్ కిషన్ అద్వానీ, చాలా కాలానికి తన గళం వినిపించారు.. ఈ మేరకు ఆయన తన బ్లాగ్‌లో... 'మొదట దేశం.. తర్వాత పార్టీ... ఆ తర్వాతే వ్యక్తిగతం' అంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో పలు ప్రకంపనలు కలుగజేస్తున్నాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ తన ప్రత్యర్థులుగా చూసిందే తప్ప.. శత్రువులుగానో, దేశద్రోహులుగానో చూడలేదని ఆయన వ్యాఖ్యానించడంపై... జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ స్పందించారు.
 
కురువృద్ధుడు అద్వానీ భాజపా అధికారంలో ఉండిన ఈ ఐదేళ్ల కాలంలో మాట్లాడి ఉంటే ఎంతో బాగుండేదని పేర్కొన్న ఆవిడ...  బీజేపీ మూలపురుషుడైన అద్వానీ తన పార్టీ ప్రస్తుత వైఖరిని ప్రశ్నిస్తుండడాన్ని తనను ఆశ్చర్యానికి గురిచేస్తోందని కూడా తెలిపారు. 
 
మోడీ ప్రధాని అయిన తర్వాత అద్వానీ నోటి నుండి ఒక్క మాట కూడా రాలేదనీ... దేశభక్తి పేరుతో విపక్ష నేతలందరినీ దేశ వ్యతిరేకులుగా ముద్ర వేసేందుకు ప్రస్తుత భాజపా ప్రయత్నిస్తోందని ఆమె మండిపడ్డారు.
 
2014 నుండి ఒక్క మాట కూడా మాట్లాడని అద్వానీ... కేంద్రంలో భాజపా అధికారం ముగియబోతున్న ఈ చివరి క్షణాల్లో మాట్లాడారని అన్నారు. మొత్తం మీద అద్వానీకి ఇప్పటికి భావ ప్రకటనా స్వేచ్ఛ వచ్చినట్లుంది కదా...

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Saiyami Kher: కాస్టింగ్ కౌచ్ : టాలీవుడ్‌లో నన్ను ఆ ఏజెంట్ కలిసింది.. అడ్జెస్ట్ చేసుకోవాలని..?

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

తర్వాతి కథనం
Show comments