కర్ణాటకలో వింత.. వర్షాల కోసం ఓ పిల్లాడిని నగ్నంగా చేసి.. తలమీద కుండలతో చల్లటి నీళ్ళు పోస్తూ..?
అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలామంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి పంటలు వేస్తున్నారు. కాని వరుణుడు ఏ మాత్రం కనికరం లేకుండా ముఖం చాటేశాడు. ఇకపోతే.. వ
అవసరమైన సమయంలో వర్షాలు లేక ఇప్పటికే చాలామంది అన్నదాతలు పంటల సాగులో వెనకబడిపోయారు. అడపాదడపా కురిసిన వానలకు ధైర్యం చేసి పంటలు వేస్తున్నారు. కాని వరుణుడు ఏ మాత్రం కనికరం లేకుండా ముఖం చాటేశాడు. ఇకపోతే.. వర్షాలు పడడానికి చాలామంది వరుణ దేవుడి పూజలు చేస్తుంటారు. ఇది అందరికి తెలిసిన విషయమే.
మన దేశంలో ఇలా ఎన్నో మూఢనమ్మకాలు -దురాచారాలున్నాయి. కానీ కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా పండరిహళ్లిలో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి ఓ పిల్లాడిని నగ్నంగా ఊరమొత్తం ఊరేగించారు. చిత్రదుర్గలో ఈ ఏడాది సరైన పంటలు పండక కరువు సంభవించింది. వర్షాలు పడక, త్రాగడానికి మంచి నీళ్లు దొరక్క ట్యాంకర్లతోనే మంచినీరు సరఫరా చేయాల్సి వస్తోంది. దాంతో వరుణదేవుడిని ప్రసన్నం చేసుకోడానికి అక్కడి గ్రామస్తులు ఓ పిల్లాడిని నగ్నంగా చేసి, అతడికి పూలు పెట్టి పూజించారు.
అంతేకాకుండా వినాయకుడి విగ్రహం చేతికి ఇచ్చి, అది పట్టుకుని గ్రామంలో రోడ్లమీద తిరగాలని చెప్పారు. ఈ మూఢ నమ్మకాలు ఆ బాబుకి తెలియదు. పెద్దవాళ్లు చెప్పినట్లే చేశాడు. అతడు విగ్రహాన్ని గ్రామ శివార్లకు తీసుకెళ్లి అక్కడ నీటిలో నిమజ్జనం చేసి రమ్మన్నారు. అతడు కూడా అలాగే చేశాడు. అలా వెళ్తున్నంత సేపు ఊపి గ్రామస్థులు ఆ బాలుడి తల మీద కుండలతో చల్లటి నీళ్లు పోస్తూ వింత వింతగా ప్రవర్తించారు. తర్వాత పిల్లాడికి కొత్త బట్టలు కొనిచ్చారు. కాగా అటుగా వెళ్తున్న వ్యక్తి ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీయడంతో కర్ణాటక బాలల హక్కుల రక్షణ కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతోంది.