Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓ నియంత : కర్నాటక సీఎం సిద్ధరామయ్య

ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. పాలనపరంగా ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహించారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ... గల్లీ నుంచి ఢిల్లీ స్థాయివరకు సముచిత పాల

Webdunia
సోమవారం, 3 అక్టోబరు 2016 (13:06 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై కర్నాటక సీఎం సిద్ధరామయ్య విమర్శలు గుప్పించారు. పాలనపరంగా ఆయన ఓ నియంతలా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహించారు. ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ... గల్లీ నుంచి ఢిల్లీ స్థాయివరకు సముచిత పాలన అందించాల్సిన ప్రధాని మీడియాను ఉపయోగించుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కులాలు, జాతుల మధ్య వైషమ్యాలు సృష్టిస్తూ చోద్యం చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. 1973–1974లో రాజీవ్‌ గాంధీ పంచాయతీ రాజ్‌ చట్టాన్ని తెచ్చినప్పటి నుంచి రైతులు, ప్రజలకు సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని తెలిపారు. 
 
కావేరి నదీ జలాల పంపిణీలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పులు రాష్ట్రానికి, ప్రజలకు శరాఘాతాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే అసెంబ్లీ తీర్మానం మేరకు తమిళనాడుకు నీటిని విడుదల చేయరాదని నిర్ణయించినట్టు ఆయన చెప్పారు. ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమన్నారు. కావేరీ జలాల విషయంలో తమది బాధిత రాష్ట్రమే గానీ, విలన్ రాష్ట్రం కాదన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments