Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నాటకలో రోజుకి 30 వేల కోవిడ్ కేసులు: జనవరి 31 నుంచి నో కర్ఫ్యూ, ఎందుకంటే?

Webdunia
శనివారం, 29 జనవరి 2022 (17:27 IST)
ప్రతిరోజూ కర్నాకటలో 30 వేలకు పైగా కోవిడ్ కేసులు నమోదవతున్నాయి. కనీసం 50 మంది చనిపోతున్నారు. ఐతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టీఏసీ) నివేదిక ఆధారంగా నైట్ కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం శనివారం ప్రకటించింది. బెంగళూరు నగరంలో 1-9 తరగతుల వరకు పాఠశాలలను ఆఫ్‌లైన్‌లో నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతించింది.
 
 
రెవెన్యూ మంత్రి ఆర్ అశోక్ మీడియాతో మాట్లాడుతూ, రికవరీ రేటు పెరుగుదల కారణంగా జనవరి 31 నుండి రాత్రిపూట కర్ఫ్యూను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. రికవరీ రేట్లు పెరుగుతున్నాయనీ, ఈసారి తీవ్రత తక్కువగా ఉందన్నారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, పబ్‌లు, రెస్టారెంట్లు, ప్రభుత్వ కార్యాలయాలు పూర్తి సీటింగ్ కెపాసిటీతో పనిచేయగలవని ఆయన చెప్పారు.

 
సినిమా హాళ్లు. మల్టీప్లెక్స్‌లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడ్డాయని అన్నారు. వివాహాలు 300 మందితో బహిరంగ వేదికలలో, 200 మంది క్లోజ్డ్ ప్లేస్‌లో నిర్వహించవచ్చు. రోజువారీ ఆచారాల కోసం మతపరమైన ప్రదేశాలు తెరవబడతాయి. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ప్రజలను అనుమతిస్తామని ఆయన తెలిపారు. స్విమ్మింగ్ పూల్స్, జిమ్‌లు, స్పోర్ట్స్ స్టేడియాలు 50 శాతం సామర్థ్యంతో పనిచేయగలవన్నారు.

సంబంధిత వార్తలు

మెంటల్ టార్చర్ భరించడం వల్ల కాదు, ఆ విషయంలో పవన్ చాలా స్ట్రాంగ్: విజయ్ సేతుపతి

మలయాళ, తమిళ సినిమాల్లో బేబెమ్మ.. తెల్ల లెహంగాలో అదుర్స్

ఐదు భాషలలొ మోటివ్ ఫర్ మర్డర్ - టీజర్‌ను రిలీజ్ చేసిన దిల్ రాజు.

హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు హీరోగా వైవిఎస్ చౌదరి చిత్రం ప్రకటన

బలగం నిర్మాత హర్షిత్ రెడ్డి కజిన్ సుమన్ తేజ్ హీరోగా సీతా కళ్యాణ వైభోగమే

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన వాకథాన్‌ని నిర్వహించిన కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలిపే 9 కారణాలు

ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం 2024: గర్భిణీ తల్లులకు సురక్షితమైన ఆహార చిట్కాలు

చెరకు రసంతో ప్రయోజనాలు సరే.. అలాంటి వారికి ఇక్కట్లే..

మజ్జిగ ఇలాంటివారు తాగకూడదు, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments