Webdunia - Bharat's app for daily news and videos

Install App

మత మార్పిడి చట్టాన్ని రద్దు చేసిన కర్నాటక ప్రభుత్వం

Webdunia
గురువారం, 15 జూన్ 2023 (19:05 IST)
కర్నాటక రాష్ట్రంలో ఇటీవల కొలువుదీరిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మతమార్పిడి వ్యతిరేక చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కర్ణాటక కేబినెట్‌ గురువారం రద్దు ప్రతిపాదనను ఆమోదించింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే పాటిల్‌ వెల్లడించారు. దీన్ని త్వరలోనే బిల్లు రూపంలో శాసనసభలో ప్రవేశపెట్టి అమల్లోకి తెస్తామన్నారు. 
 
కర్ణాటకలో గత భాజపా ప్రభుత్వం మత మార్పిడి వ్యతిరేక చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. బలవంతంగా, వంచించి, ఒత్తిళ్లు తీసుకు వచ్చి, తాయిలాలను ఆశచూపి, వివాహం చేసుకుంటానని నమ్మించి మతమార్పిడికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఈ చట్టాన్ని రూపొందించారు. 
 
దీనికి సంబంధించి పౌరులు, కుటుంబ సభ్యులు, భాగస్వాములు, సహోద్యోగులు పోలీసులు, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు. బలవంతంగా మత మార్పిడికి పాల్పడితే జామీను రహిత అరెస్టు ఉంటుంది. బలవంతంగా మత మార్పిడులకు పాల్పడే వ్యక్తులకు 3 నుంచి 10 ఏళ్ల శిక్ష, రూ.50 వేల వరకు జరిమానా విధించేలా చట్టంలో నిబంధనలు పొందుపరిచారు.
 
ఇందుకు సంబంధించిన బిల్లును గతేడాది అప్పటి ముఖ్యమంత్రి బొమ్మై నేతృత్వంలో శాసనసభలో ప్రవేశపెట్టారు. అక్కడ ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే, శాసనమండలిలో భాజపాకు సరిపడా మెజార్టీ లేకపోవడంతో బిల్లు ముందుకెళ్లలేదు. దీంతో గతేడాది మే నెలలో ఆర్డినెన్స్‌ ద్వారా ఆదేశాలను అమల్లోకి తెచ్చారు. ఆ తర్వాత గవర్నర్‌ ఆమోదంతో చట్టాన్ని అమలు చేశారు. ఇప్పుడు భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించి కాంగ్రెస్‌ అధికారంలో రావడంతో సిద్ధరామయ్య సర్కారు.. ఈ చట్టాన్ని రద్దు చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shwetha Menon: AMMA ప్రెసిడెంట్‌గా తొలి మహిళా నటిగా రికార్డ్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments